బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించాలి అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. నార్త్ కొరియా నియంత కిమ్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యాడు..
దగ్గబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది.. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీని ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అని ఆమె పేర్కొన్నారు.
ఏపీలో ఒకే రోజు ఇద్దరు కేంద్ర మహిళా మంత్రులు పర్యటిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నేడు ఏపీలో పర్యటించనున్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు.
విజయవాడలోని వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భగవంత్ కుబా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు.
నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది అంటూ ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మహాధర్మలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహించారు. సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు
ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.