Sunkara Padma Shri: ఏపీకి మట్టి-నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది అంటూ ఆమె ఆరోపించారు. దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తామని బీజేపీ చెబుతోంది.. బీజేపీ నేతలకు సిగ్గుందా?.. ఏపీకి మట్టి – నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు అంటూ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఏపీ ప్రజల నోట్లో ప్రధాని నరేంద్ర మోడీ మట్టి కొట్టారు అంటూ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మట్టి తెచ్చి.. దేశ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రధాని కంకణం కట్టుకున్నారా?.. అని ఆమె ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.. ఇలాంటి నమ్మక ద్రోహం పనులు.. కార్యక్రమాలు చేయడానికి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి బాధ వేయడం లేదా?.. పద్మశ్రీ అడిగారు.
Read Also: Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
దగ్గుబాటి పురంధేశ్వరికి చిత్త శుద్ధి ఉంటే భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవాలి అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. సీఎం జగన్ అమరావతిని సర్వ నాశనం చేస్తే.. బీజేపీ అధినాయకత్వం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదు.. అమరావతి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి.. ప్రధాని మోడీ ఏపీ ప్రజలనే కాదు.. దేశ ప్రజలను మోసం చేయడానికి నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపడుతున్నారు అంటూ ఆమె విమర్శించారు.
Read Also: Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
ఇలాంటి చెత్త కార్యక్రమాలకు పురంధేశ్వరి సహకరించడం ఎంత వరకు సబబు? అని సుంకర పద్మశ్రీ అన్నారు. ప్రజల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోంది.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేయాలి.. అమరావతి రాజధాని నిర్మాణం జరిగేలా కార్యచరణ రూపొందించాలి.. సీఎం జగన్ తో బీజేపీ చీకటి ఒప్పందాలను పక్కన పెట్టాలి అని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!