Sunkara Padma Shri: ఏపీకి మట్టి-నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు..
నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపట్టాలన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. నా భూమి.. నా దేశం పేరుతో బీజేపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది అంటూ ఆమె ఆరోపించారు. దేశ వ్యాప్తంగా మట్టిని సేకరిస్తామని బీజేపీ చెబుతోంది.. బీజేపీ నేతలకు సిగ్గుందా?.. ఏపీకి మట్టి – నీరు తెచ్చి ప్రధాని మోడీ అమరావతిని సర్వ నాశనం చేశారు అంటూ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
- Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
- IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
ఏపీ ప్రజల నోట్లో ప్రధాని నరేంద్ర మోడీ మట్టి కొట్టారు అంటూ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మట్టి తెచ్చి.. దేశ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికి ప్రధాని కంకణం కట్టుకున్నారా?.. అని ఆమె ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.. ఇలాంటి నమ్మక ద్రోహం పనులు.. కార్యక్రమాలు చేయడానికి ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి బాధ వేయడం లేదా?.. పద్మశ్రీ అడిగారు.
Read Also: Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?
దగ్గుబాటి పురంధేశ్వరికి చిత్త శుద్ధి ఉంటే భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవాలి అని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. సీఎం జగన్ అమరావతిని సర్వ నాశనం చేస్తే.. బీజేపీ అధినాయకత్వం పల్లెత్తు మాట మాట్లాడ్డం లేదు.. అమరావతి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి.. ప్రధాని మోడీ ఏపీ ప్రజలనే కాదు.. దేశ ప్రజలను మోసం చేయడానికి నా భూమి.. నా దేశం కార్యక్రమం చేపడుతున్నారు అంటూ ఆమె విమర్శించారు.
Read Also: Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
ఇలాంటి చెత్త కార్యక్రమాలకు పురంధేశ్వరి సహకరించడం ఎంత వరకు సబబు? అని సుంకర పద్మశ్రీ అన్నారు. ప్రజల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోంది.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేయాలి.. అమరావతి రాజధాని నిర్మాణం జరిగేలా కార్యచరణ రూపొందించాలి.. సీఎం జగన్ తో బీజేపీ చీకటి ఒప్పందాలను పక్కన పెట్టాలి అని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
-
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Muskmelon Health Risks: కర్బూజా కొనుగోలు చేసే ముందు.. తినకూడని వారు ఎవరు? ముఖ్య జాగ్రత్తలు
-
Heinrich Klaasen: ఇక ‘డాడీ డ్యూటీ’ మొదలవుతుంది.. ఎస్ఆర్హెచ్ హీరో క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?