రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
Vijayasai Reddy: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో రోజుకో రచ్చ అనే తరహాలో ఈ వ్యవహారం సాగుతోంది.. మీడియాతో మాట్లాడే సందర్భంలోనూ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు.. ఇక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసేవరకు వ్యవహారం వెళ్లినా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరోసార పురంధేశ్వరిపై హాట్ కామెంట్లు చేశారు ఎంపీ సాయిరెడ్డి..…
ఏపీలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురంధరేశ్వరి వర్సెస్ వైసీపీ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పురంధరేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం పై హాట్ కామెంట్ చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి వచ్చి చంద్రబాబుకు ఆయన కొడుకు కోవర్టుగా పనిచేయడానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వచ్చాడని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. పవన్ ఎవరి కోసం పార్టీ పెట్టాడు.. ఎవరి కోసం పనిచేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
పురంధేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జోలికి వస్తే సహించమని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ హెచ్చరించారు. పురంధేశ్వరిపై విమర్శలు చేసే స్థాయి సజ్జలకు లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.