ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు.
ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని మోడీ పరామర్శించనున్నారు. అనంతరం మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు.
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.
ఏపీలో వ్యవస్థలు గాడి తప్పాయి.. రాష్ట్రంలో జరుగుతోన్న క్రైమ్, ప్రస్తుత పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను గుంటూరు రమేష్ హాస్పిటల్లో వైసీపీ నేతలతో కలిసి పరామర్శించనున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్లు సృష్టించాడు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా…
ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందే ఎస్పీజీ రంగంలోకి దిగింది.. అమరావతి చేరుకున్న ప్రధాని మోడీ భద్రతా దళం.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి.. మోడీ టూర్ సాగే రూట్లలో ప్రయాణిస్తూ.. ప్రత్యేకంగా పరిశీలించింది SPG.. హెలిప్యాడ్, సభా వేదిక మార్గం, సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.. భద్రతా ఏర్పాట్లను SPGకి వివరించారు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ లు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీజీ అధికారులతో…
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.