PM Modi: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ప్రశంసించిన ప్రధాని
- మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
- వైభవ్కు శుభాకాంక్షలు తెల్పుతూ ప్రధాని ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్లు సృష్టించాడు. దేశ వ్యాప్తంగా సీనియర్ క్రికెటర్ల నుంచి, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రధాని మోడీ కూడా భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమానికి జగన్ పిలుపు..
Also Read
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2025 ఐపీఎల్లో మెరుపులు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతేడాది జెడ్డాలో జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు వైభవ్ వయసు కేవలం 13 సంవత్సరాలు. ఏప్రిల్ 19న జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన మొదటి బంతికే సిక్స్ కొట్టి సూపర్ అనిపించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. వరుసగా జరిగిన ఏడు మ్యాచ్ల్లో మెరుపులు సృష్టించాడు. 36 సగటుతో 252 పరుగులు, 206.55 స్ట్రైక్ రేట్తో యశస్వి జైస్వాల్తో బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇది కూడా చదవండి: RCB-IPL 2025: ఫైనల్లో ఆర్సీబీ గెలుస్తుంది.. జోస్యం చెప్పిన మిస్టర్ 360!
ఇక ఏప్రిల్ 28న జైపూర్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యా్చ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. టీ20 క్రికెట్లో అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వైభవ్ ఆట తీరుతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక మైలురాయిగా నిలిచాడు. ఇక మే 20న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎంఎస్.ధోనీ ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సూర్యవంశీ 33 బంతుల్లో 57 పరుగులు చేసి 2025 ఐపీఎల్ ఆటను ముగించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోవడంతో వైభవ్ స్వస్థలానికి తిరిగొచ్చేశాడు. సొంత రాష్ట్రంలో ఉన్న సూర్యవంశీ.. తన తల్లిదండ్రులతో కలిసి ప్రధాని మోడీని పాట్నా ఎయిర్పోర్టులో కలిశాడు. ఈ సందర్భంగా వైభవ్ను మోడీ ప్రశంసించారు.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!