ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు?…
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యూపీఏ తరఫున ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ సభ స్పీకర్గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మీరా కుమార్లు రేసులో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక కోసం…
ప్రస్తుత రాష్ట్రపతిపదవీ కాలం ఈ ఏడాది జులై 24తో ముగియనుండటంతో దేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత? దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ నెల…
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియాతో సమావేశమై, షెడ్యూల్ను ప్రకటించనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల జులై 24తో ముగియనుంది. 2017, జులై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్నాథ్ కోవిందే. Gujarat: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. షేక్ ఖలీఫా అబుదాబి పాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. షేక్ ఖలీఫా మరణం పట్ల ప్రపంచ దేశాలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు. యూఏఈ రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తూమ్,…
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు. ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని…
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ లోనూ చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని అప్పటి ప్రభుత్వం, సినిమా పెద్దలు భావించారు. అందుకు విశాఖ పట్టణాన్ని కేంద్రంగానూ ఎంచుకున్నారు. అప్పటికే అక్కడ డి.రామానాయుడు ఫిలిమ్ స్టూడియోస్ నిర్మించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఓ ఫిలిమ్ నగర్ కల్చరల్ క్లబ్ అవసరమని భావించారు. విశాఖ ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అక్కడి ఔత్సాహికులను ప్రోత్సహించడానికి స్థాపించడం జరిగింది. ఆ క్లబ్ కు అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నియమితులయ్యారు.…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…
జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇప్పుడు కేంద్రం మరో ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇటీవల…
శ్రీ రామానుజ సహస్రాబ్దిలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. హైదరాబాద్ చేరుకున్న రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికారు గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రపతిని శాలువాతో సన్మానించారు సీఎం కేసీఆర్.