Statue of Equality: వైభవంగా ముగిసిన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు.
భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. భారత దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్, సినీ ప్రముఖులు.. వేడుకల్లో భాగస్వాములయ్యారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహం సహా బంగారు ప్రతిమను ఆవిష్కరించారు. ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణు సహస్ర పారాయణం చేశారు. యజ్ఞంలో భాగంగా యాగశాలలోని నాలుగు మండపాల్లో విశ్వక్సేనేష్టి, నారసింహఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్ఠి, హయగ్రీవఇష్టి, వైయూహికఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతేఇష్టిలను శాస్త్రోక్తంగా చేశారు. 1035 హోమ కుండాల్లో 5 వేల మంది రుత్వికులు.. లక్ష్మీనారాయణ మహా యజ్ఞాన్ని జరిపారు. చివరి రోజు ఆ యాగానికి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో రుత్వికులు మహా పూర్ణాహుతి పలికారు.108 ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యారాధనకు సిద్ధం చేశారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకున్నారు.లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో భాగస్వాములైన వేలాది మంది ఋత్వికులను సన్మానించేందుకు శాంతి కల్యాణాన్ని వాయిదా వేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. కల్యాణ మహోత్సవాన్ని చరిత్రలో గుర్తుండేలా.. ఈ నెల 19న నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read
- Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- YS Jagan: 'నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి'.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..
- Chittoor: 'ఆమె లేక నేను లేను'.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
- Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈ సహస్రాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 8 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 1200 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది, 380 అగ్నిమాపక సిబ్బంది, 25 ఆరోగ్య సిబ్బందితో పాటు వికాస తరింగిణి నుంచి 12 వేల మంది కార్యకర్తలు సహస్రాబ్ది వేడుకల్లో సేవలందించారు. ఎన్టీవీ, భక్తిటీవీ ఈ విశేష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తులు చూసే భాగ్యం కలిగించింది.
తాజావార్తలు
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
-
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
-
Honda SP 125 vs TVS Raider 125: మైలేజీలో హోండా, ఫీచర్లలో టీవీఎస్.. 125cc సెగ్మెంట్లో ఈ రెండు బైక్లలో నంబర్ 1 ఏది?
-
Samantha : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమే.. కారణం ఏంటంటే?
-
Bollywood Updates : రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా… స్టార్ హీరో షాకింగ్ డెసిషన్
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!