Kcr Master Plan: రాష్ట్రపతి ఎన్నికలు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు.
ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకాభిప్రాయం సాధించి, ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకోవాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏప్రిల్ నెలాఖరు నుంచి పలు రాష్ట్రాల్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎంలతో చర్చించనున్నారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి. జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే.. బీజేపీ గెలుపుకు తిరుగులేదు. కానీ, బీజేపీకి మద్దతు తెలపొద్దని ప్రతిపక్ష కూటమి ఆ రెండు పార్టీల్ని ఒప్పించగలిగితే మాత్రం.. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే, కనీసం గట్టి పోటీ ఇచ్చినట్లైనా ఉంటుంది. మరి, కేసీఆర్ రచిస్తున్న వ్యూహం విజయవంతం అవుతుందా? లేదా? ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే! ఒకవేళ కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజెపీకి చెక్ పెడితే మాత్రం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో బీజేపీకి ముచ్చెమటలు పట్టించే అవకాశం వుంది.
ప్రస్తుతం బీజేపీ లేదా దాని కూటమి మొత్తం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 శాసనసభ్యులతో నిర్మితమైన కలెక్టొరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టోరల్ కాలేజ్ లో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. 6,264 ఓట్లు కలిగిన జమ్ము & కాశ్మీర్ సస్పెండ్ అవ్వడంతో.. బీజేపీ మెజారిటీ 5,46,320 ఓట్లకి పడిపోయింది. బీజేపీ ఖాతాలో మొత్తం 4,65,797 ఓట్లు ఉండగా, దాని కూటమి 71,329 ఓట్లు కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీకి మరో 9,194 ఓట్లు కావాలి.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!