Kcr Master Plan: రాష్ట్రపతి ఎన్నికలు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు.
ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకాభిప్రాయం సాధించి, ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకోవాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏప్రిల్ నెలాఖరు నుంచి పలు రాష్ట్రాల్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎంలతో చర్చించనున్నారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి. జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే.. బీజేపీ గెలుపుకు తిరుగులేదు. కానీ, బీజేపీకి మద్దతు తెలపొద్దని ప్రతిపక్ష కూటమి ఆ రెండు పార్టీల్ని ఒప్పించగలిగితే మాత్రం.. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే, కనీసం గట్టి పోటీ ఇచ్చినట్లైనా ఉంటుంది. మరి, కేసీఆర్ రచిస్తున్న వ్యూహం విజయవంతం అవుతుందా? లేదా? ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే! ఒకవేళ కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజెపీకి చెక్ పెడితే మాత్రం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో బీజేపీకి ముచ్చెమటలు పట్టించే అవకాశం వుంది.
ప్రస్తుతం బీజేపీ లేదా దాని కూటమి మొత్తం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 శాసనసభ్యులతో నిర్మితమైన కలెక్టొరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టోరల్ కాలేజ్ లో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. 6,264 ఓట్లు కలిగిన జమ్ము & కాశ్మీర్ సస్పెండ్ అవ్వడంతో.. బీజేపీ మెజారిటీ 5,46,320 ఓట్లకి పడిపోయింది. బీజేపీ ఖాతాలో మొత్తం 4,65,797 ఓట్లు ఉండగా, దాని కూటమి 71,329 ఓట్లు కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీకి మరో 9,194 ఓట్లు కావాలి.
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?