Kcr Master Plan: రాష్ట్రపతి ఎన్నికలు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు.
ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకాభిప్రాయం సాధించి, ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకోవాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏప్రిల్ నెలాఖరు నుంచి పలు రాష్ట్రాల్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎంలతో చర్చించనున్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి. జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే.. బీజేపీ గెలుపుకు తిరుగులేదు. కానీ, బీజేపీకి మద్దతు తెలపొద్దని ప్రతిపక్ష కూటమి ఆ రెండు పార్టీల్ని ఒప్పించగలిగితే మాత్రం.. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే, కనీసం గట్టి పోటీ ఇచ్చినట్లైనా ఉంటుంది. మరి, కేసీఆర్ రచిస్తున్న వ్యూహం విజయవంతం అవుతుందా? లేదా? ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే! ఒకవేళ కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజెపీకి చెక్ పెడితే మాత్రం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో బీజేపీకి ముచ్చెమటలు పట్టించే అవకాశం వుంది.
ప్రస్తుతం బీజేపీ లేదా దాని కూటమి మొత్తం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 శాసనసభ్యులతో నిర్మితమైన కలెక్టొరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టోరల్ కాలేజ్ లో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. 6,264 ఓట్లు కలిగిన జమ్ము & కాశ్మీర్ సస్పెండ్ అవ్వడంతో.. బీజేపీ మెజారిటీ 5,46,320 ఓట్లకి పడిపోయింది. బీజేపీ ఖాతాలో మొత్తం 4,65,797 ఓట్లు ఉండగా, దాని కూటమి 71,329 ఓట్లు కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీకి మరో 9,194 ఓట్లు కావాలి.
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!