గతంలో మేము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్ కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారు. లక్ష రూపాయలు మాఫీ మేము చేశాం… కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది పైసల పని… చేసేది వంద రూపాయల ప్రచారం. టీఆర్ఎస్ ది గ్రాఫిక్స్ పాలన అని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శివాజీ సినిమా..రజినీకాంత్ స్టైల్ లో ఉంది కెసిఆర్ పాలన. సభ ద్వారా రుణమాఫీ ఏమైంది అని…
యువత మేలుకో దేశాన్ని ఏలుకో అన్న సూక్తిని నిజం చేస్తున్నాడు ఆగ్రామ సర్పంచ్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు..అనే మంచి మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఆగ్రామ ప్రథమ పౌరుడు. అభివృద్ధి నూతన పంథాలో సాగాలంటే నేటి యువత రాజకీయాల్లోకి రావాలి అనే మాటకు వాస్తవ రూపంగా నిలిచాడు. గ్రామంలో సౌరవెలుగులు నింపుతూ గ్రామానికే దిక్సూచిగా, పలువురికి మార్గదర్శిగా మారాడు అంకోల్ క్యాంప్ సర్పంచ్ . అంకోల్ క్యాంప్ సర్పంచ్…
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సమర శంఖం పూరిస్తోంది. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉంది. నేడు రైతుల పొలాలకు కరెంట్ లేక ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఎంఐఎం నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు నేను…
ఈమధ్యకాలంలో అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఒక్కోసారి బిల్లులు చూసి గుండె గుబిల్లుమంటుంది. తాజాగా తెలంగాణలో వచ్చిన కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఓ సెలూన్ షాప్ కు 19,671 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. అదే మరో ఇంటికి ఏకంగా 76 లక్షలు బిల్లు వచ్చింది. అమ్మో ఇంత బిల్లా ! అని వినియోగదారులు మైండ్ బ్లాంక్ అయింది. నాయి బ్రాహ్మణులు, రజకులకు ,సెలూన్,లాండ్రీ షాప్ లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర…
ఏపీలో కరెంట్ భారం పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందా? ఒక ఇంటికి ఒకే మీటర్ పెట్టాలనే నిబంధన అమలుపై ఏపీ రంగం సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇంటికి ఒకటే మీటర్ పెట్టుకోవాలని.. మిగిలిన వాటిని తొలగించే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ఇంధన శాఖ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో…
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. విద్యుత్ ఛార్జీల పెంపు స్వల్పంగానే ఉంటుంది. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు సమర్దిస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గడిచిన ఏడు సంవత్సరాల్లో ఒక్క పైసా పెంచలేదు. తెలంగాణ పక్క రాష్టాల్లో అక్కడి ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచాయి. సింగరేణి…
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది. కళాశాల భవనాల…