ఢిల్లీలో టీటీడీ సోలార్ ప్లాంట్.. పర్యావరణానికి మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది.
కళాశాల భవనాల పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చాం. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. 190 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఈ ప్లాంట్ నిరోధిస్తుంది. కొన్ని వేల మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ప్లాంటుతో కల్గుతుంది. వెంకటేశ్వర కాలేజి అడ్మిషన్లలో తెలుగువారికి కోటా లేకుండా పోయింది. ఢిల్లీ యూనివర్సిటీ నిబంధనలు మార్చడంతో సీట్లన్నీ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్నాయి.
Also Read
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
- Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
- Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
గతంలో ఉన్న మాదిరిగా కళాశాల యాజమాన్యానికి సీట్లను రిజర్వ్ చేయమని కోరాం. తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి అడ్మిషన్ కల్పించడం సాధ్యపడుతుంది. అయితే, టీటీడీ కాలేజికి అవకాశమిస్తే, మిగతా కాలేజీలు కూడా యాజమాన్య కోటా కావాలని పట్టుబడతాయంటూ ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఏదేమైనా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు మేం కృషి చేస్తాం.
శ్రీ వెంకటేశ్వర కళాశాల ర్యాంకింగ్ గతం కంటే చాలా మెరుగుపడింది. పరిశోధనల్లోనూ కాలేజి చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. సోలార్ ప్లాంట్ కారణంగా ఆదా అయ్యే విద్యుత్తు బిల్లు సొమ్మును ప్రత్యేకంగా దాచిపెట్టమని చెప్పాను. ఆ నిధులతో కాలేజి హాస్టల్ భవంతులపై సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!