ఢిల్లీలో టీటీడీ సోలార్ ప్లాంట్.. పర్యావరణానికి మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది.
కళాశాల భవనాల పైకప్పును సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సంస్థకు ఇచ్చాం. విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూసుకుంటుంది. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. 190 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను ఈ ప్లాంట్ నిరోధిస్తుంది. కొన్ని వేల మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనం ఈ ప్లాంటుతో కల్గుతుంది. వెంకటేశ్వర కాలేజి అడ్మిషన్లలో తెలుగువారికి కోటా లేకుండా పోయింది. ఢిల్లీ యూనివర్సిటీ నిబంధనలు మార్చడంతో సీట్లన్నీ యూనివర్సిటీ ద్వారా భర్తీ అవుతున్నాయి.
Also Read
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
గతంలో ఉన్న మాదిరిగా కళాశాల యాజమాన్యానికి సీట్లను రిజర్వ్ చేయమని కోరాం. తద్వారా ఢిల్లీలో ఉంటున్న తెలుగువారికి అడ్మిషన్ కల్పించడం సాధ్యపడుతుంది. అయితే, టీటీడీ కాలేజికి అవకాశమిస్తే, మిగతా కాలేజీలు కూడా యాజమాన్య కోటా కావాలని పట్టుబడతాయంటూ ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఏదేమైనా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు మేం కృషి చేస్తాం.
శ్రీ వెంకటేశ్వర కళాశాల ర్యాంకింగ్ గతం కంటే చాలా మెరుగుపడింది. పరిశోధనల్లోనూ కాలేజి చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. సోలార్ ప్లాంట్ కారణంగా ఆదా అయ్యే విద్యుత్తు బిల్లు సొమ్మును ప్రత్యేకంగా దాచిపెట్టమని చెప్పాను. ఆ నిధులతో కాలేజి హాస్టల్ భవంతులపై సొంతంగా పవర్ ప్లాంట్ పెట్టాలని యోచిస్తున్నామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?