ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరెంట్ భారం పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందా? ఒక ఇంటికి ఒకే మీటర్ పెట్టాలనే నిబంధన అమలుపై ఏపీ రంగం సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇంటికి ఒకటే మీటర్ పెట్టుకోవాలని.. మిగిలిన వాటిని తొలగించే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ఇంధన శాఖ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటికి ఒకటే మీటర్ అంటే పేద, మధ్య తరగతి ప్రజల నెత్తిన భారీగా భారం పడడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమైంది. ఇంటికి ఒకటే మీటర్ అమరిస్తే.. మూడు, నాలుగేసి పోర్షన్లకు సంబంధించిన బిల్లు ఒక దానిపై వస్తే టారిఫ్ పెరిగిపోయి.. విద్యుత్ బిల్లులు రెండింతలు అవుతాయనేది చాలా మంది వాదన.
ఈ క్రమంలో ఇంటికో మీటర్ విధానం అంటే పోర్షనుకో మీటర్ పెట్టుకోవాలనే నిబంధనను తాము అమలు చేయాలని భావిస్తున్నట్టుగా ఇంధన శాఖ చెబుతోంది. ఇంటికో మీటర్ వేరు.. పోర్షనుకో మీటర్ వేరు అని.. రెండింటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. కొంత మంది తాము చేస్తున్న విద్యుత్ వినియోగానికి తగ్గ బిల్లులు చెల్లించకుండా ఉండేందుకు.. హై టారిఫ్ నుంచి తప్పించుకునేందుకు రకరాకల గిమ్మిక్కులు చేస్తున్నారనేది అధికారుల ఆరోపణ. కొంత మంది వినియోగదారులు ఒక పోర్షన్కు ఒకటికి మించి మీటర్లు బిగించుకున్నారని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. ఏసీలు, గీజర్లు వంటి వాటి కోసం ప్రత్యేకంగా మీటర్లు బిగించుకోవడం వల్ల తక్కువ టారిఫ్లో బిల్లులు చెల్లించే వెసులు బాటు తీసుకుంటున్నారంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇదే రుజువైనట్టు తేలింది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ఈ క్రమంలో ఒకే మీటర్ విధానాన్ని అమలు చేయాలని.. అయితే ఇది ఇంటికి కాదని.. పోర్షన్కు మాత్రమేననేది ఇంధన శాఖ వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ విధానానికి కొంత వరకు బ్రేకులు పడ్డా.. వాస్తవాలు వివరించి.. నెమ్మదిగా ఒకే మీటర్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. టారిఫ్ తగ్గించుకునేందుకు ఒకటికన్నా ఎక్కువగా మీటర్లు పెట్టుకున్నవారి చిట్టా లాగే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇలా మొత్తం డాటా సేకరించి. .. తర్వాత నెమ్మదిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?