ఒక ఇంటికి ఒకటే మీటర్.. ఈ మ్యాటర్ వర్కవుట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరెంట్ భారం పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందా? ఒక ఇంటికి ఒకే మీటర్ పెట్టాలనే నిబంధన అమలుపై ఏపీ రంగం సిద్ధం చేస్తోందా? దీనికి సంబంధించి ఏ విధంగా అడుగులు వేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇంటికి ఒకటే మీటర్ పెట్టుకోవాలని.. మిగిలిన వాటిని తొలగించే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ఇంధన శాఖ రంగం సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక ఇంటికి ఒకటే మీటర్ అంటే పేద, మధ్య తరగతి ప్రజల నెత్తిన భారీగా భారం పడడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమైంది. ఇంటికి ఒకటే మీటర్ అమరిస్తే.. మూడు, నాలుగేసి పోర్షన్లకు సంబంధించిన బిల్లు ఒక దానిపై వస్తే టారిఫ్ పెరిగిపోయి.. విద్యుత్ బిల్లులు రెండింతలు అవుతాయనేది చాలా మంది వాదన.
ఈ క్రమంలో ఇంటికో మీటర్ విధానం అంటే పోర్షనుకో మీటర్ పెట్టుకోవాలనే నిబంధనను తాము అమలు చేయాలని భావిస్తున్నట్టుగా ఇంధన శాఖ చెబుతోంది. ఇంటికో మీటర్ వేరు.. పోర్షనుకో మీటర్ వేరు అని.. రెండింటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. కొంత మంది తాము చేస్తున్న విద్యుత్ వినియోగానికి తగ్గ బిల్లులు చెల్లించకుండా ఉండేందుకు.. హై టారిఫ్ నుంచి తప్పించుకునేందుకు రకరాకల గిమ్మిక్కులు చేస్తున్నారనేది అధికారుల ఆరోపణ. కొంత మంది వినియోగదారులు ఒక పోర్షన్కు ఒకటికి మించి మీటర్లు బిగించుకున్నారని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్నారు. ఏసీలు, గీజర్లు వంటి వాటి కోసం ప్రత్యేకంగా మీటర్లు బిగించుకోవడం వల్ల తక్కువ టారిఫ్లో బిల్లులు చెల్లించే వెసులు బాటు తీసుకుంటున్నారంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఇదే రుజువైనట్టు తేలింది.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
ఈ క్రమంలో ఒకే మీటర్ విధానాన్ని అమలు చేయాలని.. అయితే ఇది ఇంటికి కాదని.. పోర్షన్కు మాత్రమేననేది ఇంధన శాఖ వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి ఈ విధానానికి కొంత వరకు బ్రేకులు పడ్డా.. వాస్తవాలు వివరించి.. నెమ్మదిగా ఒకే మీటర్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. టారిఫ్ తగ్గించుకునేందుకు ఒకటికన్నా ఎక్కువగా మీటర్లు పెట్టుకున్నవారి చిట్టా లాగే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇలా మొత్తం డాటా సేకరించి. .. తర్వాత నెమ్మదిగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!