ఏపీలో వైసీపీ గుర్తుతో గెలిచినా.. నిత్యం సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై లోక్సభ ఎంపీ ఓంబిర్లాను కూడా వైసీపీ ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని… అయినా వారి…
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు…
ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు. Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా . హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే…
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్లో జగ్గారెడ్డి పాత్ర హట్ టాపిక్గా మారింది. ఐదురోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. దీంతో కొందరూ సీనియర్ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. నిన్న పీఏసీ సమావేశంలో వాడివేడిగా సాగిన చర్చ. అయితే ఈ చర్చలో పరోక్షంగా జగ్గారెడ్డి అంశంపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో జగ్గారెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని నేరుగా కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగుర్కు సవాల్…
తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్ఘడ్ మాజీ సీఎం రమణ్సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస,…
బంగారు తెలంగాణలో రక్షకులు భక్షకులుగా మారారని బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైలులో ఉన్న మా నేత ఉన్న మా కార్యకర్తలు,నాయకులు ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజల ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బండిసంజయ్ పై ఇతర నేతలపై దాడి చేచసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ఖాకీలు గులాబీ కండువా కప్పుకుని కేసీఆర్ చేతిలో బార్బీ బొమ్మలుగా మారారని విమర్శించారు. దీక్షలో పాల్గొన్న మహిళలను కించపర్చారు. బట్టలు జారుతున్న…
తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు…
జైలు నుంచి విడుదలయిన తరువాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శులు చేశారు. ఈ మాకు జైళ్లు కొత్తకాదు 9సార్లు జైలుకి వెళ్లాను. నేను ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లాను. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నా అని బండి సంజయ్ అన్నారు. నీ సంగతెంటో తెలుస్తా.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయ్ అంటూ కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్…
రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం వేడెక్కింది. బండి సంజయ్ అరెస్ట్, నడ్డా క్యాండిల్ ర్యాలీ, టీఆర్ఎస్ నేతల కౌంటర్లు, మంత్రి కేటీఆర్ విమర్శలతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 10న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. అక్రమ అరెస్ట్లకు నిరసనగా నిరసనగా బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ప్రధానంగా 317 జీవోను సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు బీజేపీ నేతలపై ముఖ్యంగా…
ధర్మయుద్ధంలో బీజేపీయే గెలిచిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ అరెస్టు ..తదనంతర పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కోర్టులో ధర్మం గెలిచిందని కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలన్నారు. Read Also:అధికారులు పింక్ దుస్తులు వేసుకుని గుండాగిరి చేస్తున్నారు: తరుణ్ చుగ్ రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులుపెట్టారన్నారు. తప్పుడు కేసులకు బీజేపీ ఏమాత్రం అదరదు బెదరదని లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ…