భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.…
నగరంలో ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు అని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. ఆరు స్టేషన్ ల పరిధిలో జరిగిన బైక్ దొంగతనల్లో 27 మందిని అరెస్ట్ చేసాం. బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతనికి చెందిన మాలోతు ఎర్రన్నాయుడు తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసాం. వీరితో పాటు దొంగిలించిన బైక్స్ కొనుగోలు…
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం…
విశాఖలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసును చేధించారు విశాఖ సైబర్ క్రైం పోలీసులు.. డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన యువకుడిని హైదరాబాద్ కి చెందిన భార్య భర్తలు ట్రాప్ చేశారు.. వేపగుంటకు చెందిన యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్లు మెసేజ్ పంపించి ఎర వేశారు.. ఆ తర్వాత వీడియో కాల్ చేసి నగ్నంగా ఉన్నప్పుడు రికార్డ్ చేసింది మహిళ.. ఇక, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. డబ్బులు ఇవ్వకపోతే…
మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పై మరోమారు స్పందించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. పక్కరాష్ట్రంలో దిశ ఘటనలో సీపీ సజ్జనార్ చేసిన ఎన్ కౌంటర్ ను అందరూ స్వాగతించాలి అన్నారు. అలాగే అమ్మాయిల శీలాన్ని చెరచిన వాడు మగాడు కాదు మృగాడు. సజ్జనార్ చేసిన పని సమాజం నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప పాలసీ. న్యాయానికి న్యాయం జరగనపుడు సమాజంలోంచి ఒక న్యాయం పుట్టుకొస్తుంది . అదే సమాంతర న్యాయం. సమాంతర న్యాయంలో నో లా,…
కేరళ అమ్మాయి హైదరాబాద్ యువకులనే టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తుంది. కొన్ని రోజులు ఎంజాయ్ చేసి. పెళ్లి చేసుకుందామని నమ్మిస్తుంది. అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాలి.. లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలు పాలుచేస్తుంది. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు, భర్తతో జీవనం సాగిస్తూ… ఈ మోసాలకు పాల్పడుతోంది కిలాడి లేడి. ఈ లేడిపై పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ఈ మహిళా చేతిలో మోసపోయిన బాధితుడు న్యాయం కోసం రాష్ట్ర…
ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కేసులు వెయ్యికిపైగా నమోదవుతున్నాయి. ఏపీలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పోలిస్తే, విశాఖలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన తరువాత విశాఖ బీచ్కు తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో బీచ్కు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఒక్క విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశాఖ బీచ్కు పర్యాటకులు తరలి వస్తుండటంతో…
రియల్టర్ భాస్కర్ రెడ్డి కేసులో నిందితులు నేడు పోలీస్ కస్టడీకి రానున్నారు. నలుగురు నిందితులను ఏడురోజుల కస్టడీకి కోరారు పోలీసులు. దాంతో మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపి డాక్టర్ నలుగురు నిందితులను పోలీస్ కస్టడికి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. మరికాసేపట్లో చెంచల్ గూడ జైల్ నుండి నిందితులను కస్టడికి తీసుకోనున్నారు పోలీసులు. హత్యయకు కారణాలు, కీలక సూత్రదారుల పాత్రపై విచారించనున్నారు పోలీసులు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పాత్రపై విచారించనున్న పోలీసులు… విదేశీ నగదు, గుప్తనిధులు, బాబా అక్రమాలపై…
ఆంధ్రప్రదేశ్లో నాటుబాంబులు కలకలం సృష్టించాయి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాటుబాంబులతో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతిలోని పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో నాటుబాంబుల తీవ్ర కలకలం రేపాయి… మద్యం మత్తులో పది నాటుబాంబులతో వీరంగం సృష్టించాడు కృష్ణయ్య అనే వ్యక్తి… దీంతో.. ఓ నాటుబాంబు పేలింది. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. అయితే, ఆ నాటుబాంబు పేలినా.. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు..…
మాదాపూర్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతోనే విషయం బయటికి రాకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికేలు నిర్వహిస్తున్న సమయంలో… మమల్ని ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై నే చేయి చేసుకున్నారు ఇద్దరు వాహనదారులు. దాంతో ఈ ఘటన పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అయితే ఆ ఇద్దరి పై కేసు…