ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ సభ రద్దు.. మహేశ్వరం షిఫ్ట్.. కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం నియోజక వర్గంలోకి సభను మారుస్తూ నిర్ణయం తీసుకుంది… అయితే, తేదీలో మాత్రం ఎలాంటి మార్పులేదు.. ఈ నెల 18వ తేదీననే మహేశ్వరం నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించనున్నారు.
ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన సభకు రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది… ఒకటి పోలీసులు సభకు అనుమతి నిరాకరించడం అయితే.. మరొకటి.. స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి… ఈ సభ ఏర్పాటుపై అసంతృప్తితో ఉండడమేనని చెబుతున్నారు.. తనకు సమాచారం ఇవ్వకుండా సభ ఏర్పాటు పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అలకబూనిననట్టు కూడా తెలుస్తోంది.. దీంతో.. నియోజకవర్గాన్ని మార్చేసిన పీసీసీ.. మహేశ్వరంలో సభను నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, మహేశ్వరం నియోజకవర్గంలో ప్లేస్ ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది.. మొత్తంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నుంచి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి మారిపోయింది దళిత గిరిజన దండోరా సభ. కాగా, రేవంత్రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై ఆదిలో బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఆ తర్వాత ఇకపై పార్టీ విషయాలపై తాను మాట్లాడబోనని ప్రకటించారు.. ఇక, ఫోకస్ మొత్తం పార్టీ అభివృద్ధిపైనే అని ప్రకటించారు.. కానీ, ఇబ్రహీంపట్నం సభ విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!