జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్ధీన్ మాలిక్కు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సాదుద్దీన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితుల్లో సాదుద్దీన్ మాలిక్ ఒక్కడే మేజర్. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే…
తెలంగాణలో పోలీస్ అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. నలుగురు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. Niranjan Reddy: త్వరలోనే ఇంగ్లీష్…
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.…
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని…
గత కొద్ది రోజుల నుంచి పోలీసులు పబ్ లపై దాడులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో పబ్ లలో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పబ్ లను సీజ్ చేస్తూ పలువురులను అదుపులో తీసుకుంటున్న పబ్ ల భాగోవతం ఏ మాత్రం ఆగడం లేదు. పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. పబ్ లలో ఆశ్లీల నృత్యాలు, సమయానికి మించి పబ్ లు నడపడం వంటివి జరుగుతునే వున్నాయి. పబ్కు కష్టమర్లను ఆకట్టుకునేందుకు పబ్బుల్లో అశ్లీల నృత్యాలతో గబ్బు…
హైదరాబాద్ లో ఏపీ జెమ్స్, జ్యువెలరీ సంస్థ కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేరును బంజారాహిల్స్ పోలీసులు తొలగించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో శనివారం అభియోగ పత్రాలు సమర్పించారు. ఎలాంటి ఈ కేసులో ఆయన ప్రమేయం పై సాక్ష్యాధారాలు లేవని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10.5 పేర్కొన్నారు. ఏపీ జెమ్స్, జ్యువెలర్స్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించడంతో పాటు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ సెక్యూరిటీ ఇన్ఛార్జి పి. నవీన్…
కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు పోలీసులు , మరికొందరు రవాణా శాఖాధికారులు , ఇంకొందరు విజిలెన్స్ , ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు గతంలోకూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కూడా. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా దళారుల అవతారమెత్తుతున్నారు. బెదిరింపులు.. వసూళ్లు పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా…
గోదావరి నీళ్ల తరలింపునకు సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు నిజామాబాద్ జిల్లాలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్యాకేజీ 21 లో చేపట్టబోయే రిజర్వాయర్ కు భూములు ఇచ్చేందుకు ముప్పు గ్రామాల ప్రజలు ససేమిరా అంటున్నారు.. ప్రాజెక్టు పనులను పదే పదే అడ్డుకుంటూన్నారు.. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పనులు జరిపిస్తున్నారు.. అయినా ముప్పునకు గురవుతున్న గ్రామాల ప్రజలు చానైన చస్తాము.. కానీ రిడిజైన్ తో ప్రాజెక్టు పనులు చేసే ఊరుకునేది లేదని ఆందోళన బాట పట్టారు. అధికారులు మాత్రం…
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ…
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000…