Dhulipalla Narendra: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు.
అయితే.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల నరేంద్ర పిలపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టుగా చెప్పారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అనుమర్లపూడికి రాకుండా.. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం పోలీసుల కళ్లుగప్పి అనుమర్లపూడికి చేరుకన్నారు. నిన్న రాత్రి ఇంట్లో లేకుండా.. ఈ రోజు ఉదయం అనుమర్లపూడిలో నరేంద్ర ప్రత్యక్షమయ్యారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- Eluru Tragedy: ఏలూరు జిల్లాలో విషాదం.. జీడి మామిడి తోటలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి!
కాగా.. ఇటీవల కూడా ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు, మట్టి మాఫియా అడ్డుకుంది. టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. దూళిపాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కారుపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ పరిణామాలపై స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర.. అక్రమాలను ప్రశ్నిస్తే ‘‘మీకేందుకు భయం’’ అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. జగనన్న కాలనీ పేరుతో పంచాయతీ తీర్మానం చేసి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. ట్రాక్టర్ మట్టి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. ఇలా దౌర్జన్యాలు చేస్తే భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని ఫైర్
తాజావార్తలు
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!