Karimnagar: ల్యాండ్ సెటిల్ మెంట్ గ్యాంగ్ హల్ చల్.. స్పందించని పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థలం ఖాళీ వుంటే చాలు అది మనదే.. ఇలా బడాబాబుల వ్యవహారం నడుస్తోంది. ఆస్థలం కోసం రౌడీలను సైతం రంగంలోకి దింపేందుకు వెనుకాడటం లేదు. ఆస్థలం మీద యజమాని పట్టాలు చూపించిన.. స్థలం కబ్జాచేసేందుకు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇలాంటి ఘటనూ కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులో జరిగింది.
కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ హల్ చల్ చేసింది. కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్నామని ప్రాధేయపడిన వారిపై కబ్జా గ్యాంగ్ కనికరించడం లేదు. రేకుర్తి శివారులో 117 సర్వే నంబర్ లో సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసామని కొంతమంది కూలీలు వేడుకుంటున్నా వారి మాటలు పెడిచెవిన పెట్టి కబ్జా గ్యాంగ్ వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కుటుంబం రోడ్డున పడుతుందని ప్రాధేయ పడ్డా కనికరం చూపడంలేదని వాపోతున్నారు. ఇదే సర్వే నంబర్ 12 గుంటల భూమి ఉందని ఓ వర్గం రంగంలోకి దిగడంతో.. అక్కడ కొనుగోలు చేసిన కూలీలకు , ఆవర్గం వారికి వాగివ్వాదం జరిగింది. అయినా కబ్జాగ్యాంగ్ వెనక్కు తగ్గలేదు. ల్యాండ్ ఖాళీ చేయించేందుకు రౌడి గ్యాంగ్ రంగంలోకి దిగడంతో.. అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భూ వివాదాలు న్యాయ స్థానల్లో పరిష్కరించుకోవాలని చెప్పే పోలీసులు.. ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉండటం పై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
సామాన్యులకు అండగా వుండాల్సిన పోలీసులే రౌడీలకు మద్దతు పలుకుతున్నారని సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపుకొట్టుకుని కూలీ నాలీ చేస్తూ వచ్చిన డబ్బులతో ఈ స్థలం కొనుగోలు చేసామని, పట్టాలు చూపిస్తున్నా.. స్థలం కబ్జా చేయడం ఏంటని, మేము రోడ్డున పడతామని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా మా భూమిని కబ్జాచేస్తే మాకు నిలువ నీడలేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సెటిల్ మెంట్ గ్యాంగ్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు సైలెంట్ గా వ్యవహరించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!