Karimnagar: ల్యాండ్ సెటిల్ మెంట్ గ్యాంగ్ హల్ చల్.. స్పందించని పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్థలం ఖాళీ వుంటే చాలు అది మనదే.. ఇలా బడాబాబుల వ్యవహారం నడుస్తోంది. ఆస్థలం కోసం రౌడీలను సైతం రంగంలోకి దింపేందుకు వెనుకాడటం లేదు. ఆస్థలం మీద యజమాని పట్టాలు చూపించిన.. స్థలం కబ్జాచేసేందుకు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇలాంటి ఘటనూ కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులో జరిగింది.
కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ హల్ చల్ చేసింది. కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్నామని ప్రాధేయపడిన వారిపై కబ్జా గ్యాంగ్ కనికరించడం లేదు. రేకుర్తి శివారులో 117 సర్వే నంబర్ లో సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసామని కొంతమంది కూలీలు వేడుకుంటున్నా వారి మాటలు పెడిచెవిన పెట్టి కబ్జా గ్యాంగ్ వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కుటుంబం రోడ్డున పడుతుందని ప్రాధేయ పడ్డా కనికరం చూపడంలేదని వాపోతున్నారు. ఇదే సర్వే నంబర్ 12 గుంటల భూమి ఉందని ఓ వర్గం రంగంలోకి దిగడంతో.. అక్కడ కొనుగోలు చేసిన కూలీలకు , ఆవర్గం వారికి వాగివ్వాదం జరిగింది. అయినా కబ్జాగ్యాంగ్ వెనక్కు తగ్గలేదు. ల్యాండ్ ఖాళీ చేయించేందుకు రౌడి గ్యాంగ్ రంగంలోకి దిగడంతో.. అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భూ వివాదాలు న్యాయ స్థానల్లో పరిష్కరించుకోవాలని చెప్పే పోలీసులు.. ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉండటం పై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
సామాన్యులకు అండగా వుండాల్సిన పోలీసులే రౌడీలకు మద్దతు పలుకుతున్నారని సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపుకొట్టుకుని కూలీ నాలీ చేస్తూ వచ్చిన డబ్బులతో ఈ స్థలం కొనుగోలు చేసామని, పట్టాలు చూపిస్తున్నా.. స్థలం కబ్జా చేయడం ఏంటని, మేము రోడ్డున పడతామని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా మా భూమిని కబ్జాచేస్తే మాకు నిలువ నీడలేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సెటిల్ మెంట్ గ్యాంగ్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు సైలెంట్ గా వ్యవహరించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!