Noodles: బాలుడి ప్రాణం తీసిన నూడిల్స్.. అదే కొంప ముంచిది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూడిల్స్ ఓ బాలుడు ప్రాణాలు తీశాయి.. ఎంతో ఇష్టంగా తన కుమారుడికి నూడిల్స్ పెట్టింది ఆ తల్లి.. అవి తిన్న కాసేపటికే ఆ బాలుడు అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆ బాలుడి ప్రాణాలు మాత్రం దక్కకపోవడం విషాదంగా మారింది.. తమిళనాడులో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు.. రెండేళ్ల బాలుడు ఉన్నాడు.. అయితే, కొంత కాలంగా ఆ బాలుడు అలెర్జీతో బాధపడుతున్నారు.. వైద్యునికి చూయించి తగిన చికిత్స అందిస్తున్నారు.. ఇదే సమయంలో నూడిల్స్ తిని అస్వస్థతకు గురయ్యాడు.
Read Also: CM YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక వ్యాఖ్యలు
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
శుక్రవారం రాత్రి సమయంలో నూడిల్స్ చేసిన తల్లి.. ఆ బాలుడికి పెట్టింది.. మిగిలింది ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు ఉదయం ఆ రెండేళ్ల బాలుడికి ఆహారంగా పెట్టింది.. అయితే, అవి తిన్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు సదరు బాలుడు.. వాంతులు చేసుకుని అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ, అప్పటికే బాలుడు మృతిచెందినట్టు నిర్ధారించారు వైద్యులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు.. మరి బాలుడి మృతికి కారణం ఏంటి? నూడిల్స్ ఆ బాలుడు ప్రాణాలు తీశాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టం అవుతుందని చెబుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!