పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్లో సునీత టీచర్గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు.
ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూ లో సడలింపు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ బుధవారం చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ కర్ఫ్యూని విధించారు.
Student Vaibhav: నగరంలోని జిల్లెలగూడలో మంగళవారం ఇంటర్ విద్యార్థి వైభవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని ఆత్మహత్యకు ముందు వైభవ్ సూసైడ్ నోట్ రాశాడు.
బాలీవుడ్ రాపర్ బాద్షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్ప్లే అనే బెట్టింగ్ యాప్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్వర్క్ రాపర్ బాద్షా, నటుడు సంజయ్ దత్తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తుపాకీ చోరీ కలకలం రేపుతుంది. 30 రౌండ్లతో కూడిన ఇన్సాస్ 60 వెపన్ చోరీ అయింది. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కు చెందిన ఇన్సాస్ 60 వెపన్ మాయం అయిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.