BRS Chief: ఇది కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాదు.. కేసీఆర్ పై జరిగిన దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదు అని ఆయన తెలిపారు. దీంతో కాసేపట్లో సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు.
Read also: Police Case: ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడి.. కత్తితో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తోంది.. అవినీతి రహిత పాలన అందించాం.. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఉందన్నారు. బాన్సువాడలో పోచారం లక్ష మెజార్టీ తో గెలుస్తారు.. మళ్ళీ పెద్ద హోదాలో ఉంటారు.. ముస్లిం మైనార్టీల కోసం 2 వందల స్కూళ్ళు ఏర్పాటు చేశామన్నారు. శత్రువులను కూడా మనం ఇబ్బంది పెట్టలేము.. చేతగాని దద్దమ్మలు కొత్త ప్రభాకర్ పై కత్తి పోట్లకు ఒడిగట్టారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఈ దాడి అరాచకం, దుర్మార్గం, గెలిపిస్తే పనిచేయాలి గాని గుండాయిజం చేయొద్దు.. ఇది కేసీఆర్ పై దాడిగా భావిస్తాము.. హింసా రాజకీయాలను తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి.. మా సహనాన్ని పరీక్షించొద్దు అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..
ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై మంత్రి హరీశ్ రావుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!