PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం అయిన విషయాన్ని రాష్ట్రపతి భవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల అమెరికా, ఈజిప్టు పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలు తెలియలేదు.
Asadudiin Owaisi: భారతదేశంలో వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఓ సమస్యగా భావిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భోపాల్ లో ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ యూనిఫా సివిల్ కోడ్ (యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nitin Gadkari: ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో అతిపెద్ద రోడ్ నెట్ వర్క్ కలిగిన దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
PM Modi: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్, UCC)ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మంగళవారం పర్యటించారు.
PM Modi: 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల''ను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి మంగళవారం ఐదు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు సోమవారం అధికారిక ప్రకటన తెలిపింది
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాగర్కర్నూల్ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా... ఇది కేసిఆర్ అడ్డా...నోరు అదుపులో పెట్టుకో బిడ్డా అంటూ హెచ్చరించారు.
Nirmala Sitharaman: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన పతాక శీర్షికల్లో నిలిచింది. జో బిడెన్ పరిపాలన అతన్ని వైట్ హౌస్కు స్వాగతించడానికి సిద్ధమవుతున్నప్పుడు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలోని ముస్లింల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
PM Modi: భారతదేశంలో చీకటి అధ్యాయానికి 48 ఏళ్ల నిండాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ, ఆ నాటి రోజుల్ని వ్యతిరేకించిన వారికి నివాళులు అర్పిస్తోంది