ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాకతో రేపు హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్, ఎల్బీస్టేడియం సభ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఉన్నతాధికారుల సూచనలతో ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ లను మూసివేయాలని (HMDA) నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అయ్యాక రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఇందిరా పార్క్ వద్ద మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో breaking news, latest news, telugu news, pm modi, harish rao
PM Modi: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’లో ఇరుకున్నారు. యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్కి రూ. 508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయం ప్రాముఖ్యతను పెంచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ని ఉటంకిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్రమ డబ్బును తరలిస్తున్న కొరియర్ని ఈడీ పట్టుకోవడంతో ఈ విషయాలు…
PM Modi:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ప్రధాని మోడీ ప్రకటించారు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. తాజాగా ఈ యుద్ధంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్తో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఇరువురు నేతల భద్రత, మానవత పరిస్థితులను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం ప్రతీ ఒక్కరికి ముఖ్యమే అని ప్రధాని మోడీ అన్నారు.
PM Modi: ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.