National Space Day: భారతదేశం నేడు (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది దేశం యొక్క మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఇక ఈ ఏడాది నుండి ప్రతి సంవత్సరం చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటారు. తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం ద్వారా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 23న భారత అంతరిక్ష…
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్కతాలోని ఆర్జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మొదటగా పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యనైనా యుద్ధభూమిలో కాకుండా సంభాషణలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉక్రెయిన్ మరియు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం లభించదని భారత్ దృఢంగా విశ్వసిస్తోందని మోడీ చెప్పారు.
Shraddha Kapoor gains more followers than PM Modi in Instagram: ప్రధానమంత్రి మోదీని ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వెనక్కి నెట్టేసిన్నది. అదేంటి అని అనుకుంటున్నారా? నిజమేనండి ఒక రకంగా చెప్పాలంటే ఇండియా వరకు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆయనకు ఇంస్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ విషయంలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు. పొలిటీషియన్స్ లో ఆయనే టాప్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్…
Modi : ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పోలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్లో ఉంటారని, ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్కు బయల్దేరి వెళ్లనున్నారు.
Atchutapuram Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో గల ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ప్రధాని మోడీ రెండు విదేశీ పర్యటనల్లో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం లభించింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి స్వాగతం పలికారు. ఈ పర్యటన భారతదేశం-పోలాండ్ స్నేహానికి ఊపందుకుంటుందని... ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
PM Modi: యూరోపియన్ దేశం పోలెండ్ పర్యటనకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయలుదేరారు. ఓ భారత ప్రధాని పోలెండ్ పర్యటనకు వెళుతుండడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు పోలాండ్, ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. అయితే ఈసారి ప్రధాని మోడీ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.