ప్రధాని మోడీ శనివారం మహారాష్ట్రలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక ముంబైలో మెట్రో లైన్-3ను ప్రారంభించారు. అనంతరం బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు పర్యటనలో భాగంగా మహారాష్ట్రలో నేడు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్లో పొహరాదేవికి వెళ్లారు. వాషిమ్ జిల్లాలోని పోహరాదేవిలో ఉన్న జగదాంబ మాత ఆలయంలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ సంప్రదాయ డ్రమ్ వాయిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. పొహరాదేవిలోని సమాధి వద్ద సంత్ సేవాలాల్…
PM Modi Maharashtra Tour: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈరోజు (శనివారం) ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటనలో వాషిం నుంచి ముంబై, థానే వరకు దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వాషిమ్లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగం పురోగతికి రూ. 23 వేల 300 కోట్లు, థానేలో పట్టణ అభివృద్ధికి రూ. 32 వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దాదాపు…
పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్గా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్గా మారిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు.. వచ్చే ఐదేళ్లలో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని పిలిచి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తరువాత పెరిగిన శత్రుత్వాలపై హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో కూడిన కమిటీతో పాటు ప్రధాని చర్చించారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారతదేశం అన్ని పార్టీలను కోరింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం…
PM Modi: మరో రెండు రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్బై చెప్పాడు.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కౌటిల్య ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం సదస్సును ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిసిన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది.
గత ఆగస్టు 24న కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ప్రకటించింది. ఇప్పుడు వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 15న దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది.