Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bjp Rajya Sabha Member Laxman Criticized The Congress

MP Laxman: దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు..

Published Date :November 7, 2024 , 8:12 pm
By Rajesh Veeramalla
  • బై వన్.. గేట్ వన్ రాజకీయాలు బీజేపీ పాలనలో ఉండవు- లక్ష్మణ్
  • దేశ సంపద ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్ ది
  • దేశ సంపదకు ప్రతి పౌరుడు అర్హుడు అనే విధానాలు బీజేపీది- లక్ష్మణ్
  • ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేయదు- లక్ష్మణ్
  • 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుంది- లక్ష్మణ్.
MP Laxman: దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బై వన్, గేట్ వన్ రాజకీయాలు బీజేపీ పాలనలో ఉండవని అన్నారు. దేశ సంపద ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్‌ది అని ఆరోపించారు. దేశ సంపదకు ప్రతి పౌరుడు అర్హుడు అనే విధానాలు బీజేపీది.. ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ రాజకీయాలు చేయదని తెలిపారు. దేశ భక్తి, అట్టడుగు వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది.. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతుందని లక్ష్మణ్ అన్నారు. దేశం బీజేపీ పాలన వైపుకు చూస్తోంది.. బీజేపీపై ప్రగాఢమైన విశ్వాసంతో దేశ ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం అడ్డదారులు తొక్కే పార్టీ బీజేపీ కాదు.. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అని అన్నారు. జనవరి చివరి లోపల రాష్ర్ట జాతీయ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని లక్ష్మణ్ తెలిపారు.

Kamal Haasan: పుట్టిన రోజు వేళ హీరో కమల్ హాసన్ ఇంటి ఎదుట ముస్లింల ధర్నా

కాంగ్రెస్ ఎంత విషపూరితమైన ప్రచారం చేసినా.. దేశ ప్రజలు మోడీని మూడోసారి గెలుపించుకున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రజా సంక్షేమ ప్రతిఫలాలు నేడు ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందుతున్నాయి.. నాటి కాంగ్రెస్ పాలనకు నేటి బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు, వన్ నేషన్, వన్ ఎలెక్షన్ సాహసోపేతమైన నిర్ణయాలు అని తెలిపారు. దేశ అభివృద్ధిలో మోడీ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ ఫలాలు కింది స్థాయి ప్రజలకు అందించాలనే తపనతో మోడీ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీకి సంస్థాగత నిర్మాణం ముఖ్యమైనది.. సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్నందుకే గుజరాత్ లో గత 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నామన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాంటి పటిష్ఠమైన సంస్థాగత నిర్మాణం ప్రతి రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది.. జరగాలని లక్ష్మణ్ చెప్పారు.

Parenting Tips : మీ పిల్లలు మాట వినట్లేదా? వారిని కొట్టకుండా మార్చే టిప్స్ ..

మహారాష్ట్ర, జార్ఖండ్ లో కచ్చితంగా బీజేపే అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. మరోవైపు.. రాహుల్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడారని ఆరోపించారు. కులగణన దేశానికి మోడల్ కాదు.. చీటింగ్ అని తెలిపారు. కాంగ్రెస్ బూటకపు మాటలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సీతారామ్ కేసరి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు అధ్యక్షులు కావాలంటే నెహ్రూ అనే తోక కావాలి.. అదే బీజేపీలో సామాన్య పౌరుడు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని లక్ష్మణ్ అన్నారు. రాజకీయ అవకాశాలు సమానత్వంగా ఇచ్చే ఏకైక పార్టీ దేశంలో బీజేపీనేనని పేర్కొన్నారు. బీజేపీకి పదవులు ముఖ్యం కాదని.. బాధ్యతలు ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.. 2040 వరకు వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేననే లక్ష్యంతో ప్రతి కార్యకర్త ముందుకు వెళ్ళాలని లక్ష్మణ్ సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • criticized
  • PM Modi
  • Rajya Sabha member Laxman

తాజావార్తలు

  • Most Expensive Diamonds: కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం! ధర ఎంతో తెలుసా

  • Ajinkya Rahane: నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు.. రహానే సంచలన వ్యాఖ్యలు!

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions