PM Modi: డ్రైవర్ సీటు కోసం ఇండియా కూటమిలో కుమ్ములాటలు
- డ్రైవర్ సీటు కోసం ఇండియా కూటమిలో కుమ్ములాటలు
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అఘాడీ నేతలు కొట్టుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో నిర్వహించిన ప్రచార సభలో మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గత అయిదేళ్లలో మహారాష్ట్రలో మారిన ప్రభుత్వాలను ప్రాస్తావిస్తూ.. ఎంవీయే కూటమి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పాలించిందని, ఆ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రజలను లూటీ చేసేందుకు వారు రాజకీయాల్లో ఉంటారని, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తారని మండిపడ్డారు. తర్వాత ఏర్పడిన మహాయుతి ప్రభుత్వంతో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి మాత్రమే రాష్ట్రంలో సుపరిపాలనను అందించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: సిద్ధరామయ్య ‘‘మాస్ లీడర్’’.. అందుకే బీజేపీ ఖతం చేయాలని చూస్తోంది..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ప్రజల్లో విష బీజాలు నాటి, మతం పేరుతో దేశ విభజనకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే వారంతా ఐక్యంగా ఉన్నంతకాలం బలంగా ఉంటారని.. ఏ శక్తీ వారిని అడ్డుకోలేదన్నారు. జమ్మూకశ్మీర్లో ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కాశ్మీర్పై వారి కుట్రను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించారని.. అది ఎప్పటికీ జరగని పని అని మోడీ స్ప ష్టం చేశారు.
మోడీ పర్యటన..
నవంబర్ 9న ప్రధాని మోడీ మధ్యాహ్నం అకోలాలో, మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రసంగించనున్నారు. నవంబర్ 12న చిమూర్, షోలాపూర్లలో ర్యాలీల్లో పాల్గొని సాయంత్రం పూణెలో జరిగే రోడ్షోలో మోడీ పాల్గొంటారు. నవంబర్ 14న ఛత్రపతి సంభాజీనగర్, రాయ్గఢ్, ముంబైలో చివరిగా ర్యాలీలకు ప్లాన్ చేశారు. 288 సీట్ల మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఫలితాలు మూడు రోజుల తర్వాత (నవంబర్ 23) లెక్కించబడతాయి.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి చెందిన శివసేన వర్గం, అజిత్ పవార్కి చెందిన ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT), శరద్ పవార్ NCP (SP), కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!