గిరిజన వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో జరిగిన సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
PM Modi : ధర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా బీహార్లోని జాముయ్లో ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించి, ఆయన పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్బార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్గాంధీ మాట్లాడారు.
PM Modi: కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినికా ప్రధాని నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసినందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు ‘‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’’ని ప్రధానం చేసింది.
Maharastra : ప్రధాని నరేంద్ర మోదీ నేడు అంటే గురువారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఆయన ఇక్కడ మూడు ర్యాలీలు చేశారు. రాష్ట్ర రాజధాని ముంబైలో కూడా ఆయన సమావేశం కానున్నారు.
Modi-Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీ పాదాలను తాకబోయారు. బీహార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. 73 ఏళ్ల నితీష్ కుమార్, 74 ఏళ్ల ప్రధాని మోడీ వైపు కదులుతూ.. పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.
PM Modi : నేడు బీహార్లోని దర్భంగా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోదీ ఎయిమ్స్ దర్భంగాను ప్రారంభించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు అని మార్కెట్ వెటరన్ మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మోడీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Naveen Ramgoolam: మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్గూలం విజయం సాధించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అభినందించారు. రెండు దేశాల మధ్య ప్రత్యేకమైన విశిష్టమైన భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అతనితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.