PM Modi: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈ సారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండగ వచ్చిందని పీఎం మోడీ అన్నారు. దేశంలో ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ నిజం అవుతుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతిపక్షాలు…
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యమైన పండగ సందర్భంగా ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కాంక్షించారు.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం…
PM Modi: దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన కేవడియాలో ఉంటారు. ఇక్కడ జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రూ.284 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్లు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం…
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. దీపావళి రోజున గుజరాత్ ప్రజలకు వేలకోట్ల విలువైన బహుమతులు ఇవ్వనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వృద్ధులకు దీపావళి బహుమతి అందించారు. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఏటా రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. ‘ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ (PMJAY) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
PM Modi : ఉపాధి మేళా కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎంపికైన 51,000 మందికి పైగా అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేశారు.
పగలు, పట్టింపులు, శత్రుశ్వాలు పక్కనబెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. VMRDA ఎరీనలో ప్రధాన మంత్రి రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు బండి సంజయ్.
C-295 Military Aircraft: ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం సంయుక్తంగా టాటా ఎయిర్క్రాఫ్ట్ని ప్రారంభించారు. గుజరాత్ వడోదరలోని టాటా ఫెసిటిలీలో 40 సైనిక వ్యూహాత్మక రవాణా విమానాలైన C-295 ఎయిర్క్రాఫ్ట్లను నిర్మించనున్నారు. ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. C-295 ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు: C-295 ఎయిర్క్రాఫ్ట్ వైమానిక దళానికి ఎంతో కీలకమైనది. ఈ విమానాలకు 5-10 టన్నుల సామర్థ్యం ఉంటుంది. C-295 అనేది 71 మంది…
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.