King Charles: దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు.. ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
- దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు దంపతులు
- ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది. అయితే భారత పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ దంపతులకు ప్రధాని మోడీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం కారణంగా 2022లో భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఇటీవల బంగళూరులో అత్యంత రహస్యంగా వారం రోజులు పర్యటించి వెళ్లారు. కానీ ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి మోడీ స్పెషల్ విందు ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Mega Auction: ఢిల్లీకి ఆర్సీబీ కెప్టెన్.. బేస్ ప్రైస్కే కొనుగోలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
కింగ్ చార్లెస్ (76)కు ఫిబ్రవరి కేన్సర్ నిర్ధారణ అయింది. అయితే ప్రధాని మోడీ యూకేలో పర్యటించినప్పుడు కేన్సర్ చికిత్సకు సంబంధించిన వైద్యం గురించి తెలియజేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన వైద్యం కోసం అక్టోబర్లో బెంగళూరులో పర్యటించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చార్లెస్ ఆరోగ్యం కుదిటపడినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాసియా పర్యటనకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. అయితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019 నవంబర్లో కూడా ఆయన భారత్కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్లో లండన్లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. మోడీ మాటల మేరకే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో