King Charles: దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు.. ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
- దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు దంపతులు
- ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది. అయితే భారత పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ దంపతులకు ప్రధాని మోడీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం కారణంగా 2022లో భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఇటీవల బంగళూరులో అత్యంత రహస్యంగా వారం రోజులు పర్యటించి వెళ్లారు. కానీ ఇప్పుడు అధికారిక పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు ఇండియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి మోడీ స్పెషల్ విందు ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Mega Auction: ఢిల్లీకి ఆర్సీబీ కెప్టెన్.. బేస్ ప్రైస్కే కొనుగోలు
Also Read
కింగ్ చార్లెస్ (76)కు ఫిబ్రవరి కేన్సర్ నిర్ధారణ అయింది. అయితే ప్రధాని మోడీ యూకేలో పర్యటించినప్పుడు కేన్సర్ చికిత్సకు సంబంధించిన వైద్యం గురించి తెలియజేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన వైద్యం కోసం అక్టోబర్లో బెంగళూరులో పర్యటించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చార్లెస్ ఆరోగ్యం కుదిటపడినట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాసియా పర్యటనకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. అయితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019 నవంబర్లో కూడా ఆయన భారత్కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్లో లండన్లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. మోడీ మాటల మేరకే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.
ఇది కూడా చదవండి: Pushpa -2 : సౌత్ ఇండియా నం-1 గా నిలిచిన ‘కిస్సిక్’ సాంగ్
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?