ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్లో ఇది 18వ వేలం కావడం విశేషం.
IPL 2025కి ముందు నిర్వహించే మెగా వేలం కోసం ఆటగాళ్ల నిలుపుదల (Retention), విడుదల (Release) జాబితా విడుదల చేయబడింది. గురువారం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2025 కోసం తమను కొనసాగించాలనుకుంటున్న పేర్లను ప్రకటించగా.. అదే సమయంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు జట్లు వదిలేశాయి.
టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లలో ఒక్క భారత ఆటగాడి పేరు లేదు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో లేరు. భారత ఆటగాళ్ల పేరిట ఎన్నో అరుదైన రికార్డులున్నప్పటికీ, ఈ రికార్డు లేకపోవడం గమనార్హం.
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్…
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్ కోసం టీమిండియా బార్బడోస్లో అడుగుపెట్టింది. (ANI) X ఖాతాలో అప్లోడ్ చేసిన వీడియోలో.. భారత జట్టులోని సభ్యులు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి పలువురు విమానాశ్రయం నుండి వారి బస్ ఎక్కేందుకు వెళ్తుండటం చూడొచ్చు. జట్టు సభ్యులతో పాటు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు వీడియోలో కనిపించారు.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండి.. టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు కన్నీటిపర్యంతం అయ్యారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే.... ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది.
న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు లభించనున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మేనేజ్మెంట్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న న్యూజిలాండ్తో మ్యాన్ అనంతరం వారికి ఏడు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు.