GPS Signal: మిడిల్ ఈస్ట్పై నుంచి వెళ్తున్న విమానాల్లో GPS సిగ్నల్స్ కోల్పోతున్నాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంపై నుంచి వెళ్తున్న పౌర విమానాల్లో కొన్ని సార్లు జీపీఎస్ సిగ్నల్స్ అందడం లేదని నివేదికలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారత విమానయాన సంస్థలకు కీలక సూచనలను జారీ చేసింది.