Pawan Kalyan: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు…
Tirumala Laddu Controversy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.. ఈ వ్యవహారంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. అయితే, తిరుమల లడ్డు అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్తో కమిటీ ఏర్పాటు…
Ustaad Bhagat Singh 2nd Song Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవర్ ప్యాక్డ్ పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ ఫ్యాన్స్ను మంచి కిక్ ఇవ్వగా.. ఇప్పుడు చిత్ర…
టాలీవుడ్లో హీరోయిన్ల కెరీర్లు ఒక్క సినిమాతోనే మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు శ్రుతి హాసన్ వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడిన సమయంలో.. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆమె కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఒక్క హిట్తో శ్రుతి స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. ఆపై చేసిన అన్ని సినిమాలు ఆమె రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో కూడా శ్రుతి నటించారు. ఇప్పుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉంటూనే తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేస్తున్న పవన్, తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కానుంది.…
NDA Meeting: ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు…
OTR: తెలంగాణలోకి జనసేన ఎలక్షన్ ఎంట్రీ ఇస్తోంది. అందుకు మున్సిపల్ ఎన్నికల్ని లాంఛ్ప్యాడ్గా ఎంచుకుంది. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని డిసైడైన జనసేనాని పవన్కళ్యాణ్ ఈ వారంలో ఇక్కడ మైకందుకోబోతున్నారు. మరి జనసేన ప్రచారం తెలంగాణలో బీజేపీకి లాభనా? లేక నష్టమా? తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంట్ని రాజేస్తుందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన జనసేన ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి…
తిరుమల లడ్డు అంశం రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో కూటమి నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు రేపు కీలక సమావేశం జరగనుంది. మూడు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ పాల్గొనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. తిరుమల…
సీఎం చంద్రబాబు ఏడాదిన్నరగా కావాలనే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా ప్రచారం చేశారని, చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వారు…
ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.…