Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగం
- జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు
- టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను
- టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుదే తప్పని చెప్పానన్నారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
‘గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడింది. లడ్డూ కల్తీపై నేను దీక్ష చేశాను. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలింది. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ విషయంలో ఏమి చెయ్యాలో ఆలోచించా. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదు, గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదు. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చింది’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
‘ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారు. రసాయనాల్లో అసలు ఏముందో దేవుడికే తెలియాలి. దీని నుంచి ఎవరు లబ్ధి పొందేది. ఇది హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారు. అన్ని విషయాల్లో పాలక మండలి బాధ్యత తీసుకోవాలి. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రసంగం చివరిలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణ దేవరాయుల పద్యాన్ని పవన్ చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితిని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!