Pawan Kalyan: వైఎస్ జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగం
- జగన్ తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదు
- టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను
- టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డుదే తప్పని చెప్పానన్నారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని, కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
‘గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడింది. లడ్డూ కల్తీపై నేను దీక్ష చేశాను. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలింది. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఈ విషయంలో ఏమి చెయ్యాలో ఆలోచించా. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదు, గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పాను. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదు. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు?. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చింది’ అని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు.
Also Read
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
‘ఎన్డీడీబీ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పారు. రసాయనాల్లో అసలు ఏముందో దేవుడికే తెలియాలి. దీని నుంచి ఎవరు లబ్ధి పొందేది. ఇది హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారు. అన్ని విషయాల్లో పాలక మండలి బాధ్యత తీసుకోవాలి. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రసంగం చివరిలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణ దేవరాయుల పద్యాన్ని పవన్ చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితిని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!