At Home: నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనేపథ్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు…
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎగురవేశారు. ఈ వేడుకలకు పవన్ తన కూతురు ఆద్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన డిప్యూటీ సీఎం తన కుమార్తెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటోని చూసిన పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ ఫోటోకి నెట్టింట పెద్ద ఎత్తున షేర్లు, లైక్స్,…
ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి . ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యాశాఖపై…
Harish Shankar Responds on Pawan Kalyan Smuggler Heros Comments: కొద్దిరోజుల క్రితం జరిగిన కర్ణాటక అటవీ శాఖ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. తాజాగా ఇదే విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో విత్తన కొరత లేదు.. వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి అంటూ వైఎస్ షర్మిలకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమన్న ఆయన.. రాజకీయాల కోసం అటు అన్న, ఇటు చెల్లెలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు..
Pawan Kalyan Alotted Dates to Shoot for OG Movie: యంగ్ డైరెక్టర్ సుజీత్తో పవర్ స్టార్ సినిమా అనగానే.. అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. ఎందుకంటే.. సుజీత్ పవన్కి డై హార్డ్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన అభిమాన హీరోని ఏ రేంజ్లో చూపిస్తాడనేది.. పవన్ ఫ్యాన్స్ను పిచ్చెక్కేలా చేసింది. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హంగ్రీ చీతా అంటూ రిలీజ్ చేసిన ఓజి గ్లింప్స్తో పూనకాలు తెప్పించాడు సుజీత్. అలాంటోడు మళ్లీ…
ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.