టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. 18వ లోక్సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. 'యోధులు తిరిగి వచ్చారు' అని రాశారు. 2019 ఫొటోలో.. ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్లు లోక్సభలో కూర్చున్నట్లు ఉండగా.. తాజా ఫొటోలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు.
CM Revanth Reddy: రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశానికి ముందు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. దేశానికి మోడీ ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు.. యావత్ దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.. ఇక, నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా మారిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, నరేంద్ర మోడీ లాంటి పవర్ ఫుల్ వ్యక్తిని చూడలేదన్నారు.. మేకిన్ ఇండియా, విజినరీతో మోడీ.. దేశానికి అద్భుత విజయాలు అందించారని ప్రశంసలు కురిపించారు..
ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్లమెంటులో సంచలన మార్పులు జరుగుతున్నాయి. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సహా కీలక మహామహుల విగ్రహాల స్థానాలను మార్చడం తీవ్ర దుమారం రేపుతుంది.
2024 ఎన్నికల్లో విజయం సాధించి.. తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెడుతున్న సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వంటి ప్రముఖులు మొదటి సారిగా 18వ లోక్సభలో కాలుమోపనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించి పార్లమెంటులోకి రావడానికి సిద్ధమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది.
పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.