DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
- రాజ్యసభలో క్షీణించిన కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం
- అపస్మారక స్థితికి చేరుకున్న రాజ్య సభ ఎంపీ
- అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లిన తోటి ఎంపీలు
- ఈ ఘటనపై బయటకు వచ్చిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోలాహలం మధ్య ఫూలో దేవి ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకుందని సమాచారం. తోటి ఎంపీలు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు.
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
అంబులెన్స్ లో ఫూలో దేవిని పార్లమెంట్ కాంప్లెక్స్కు తీసుకెళ్లిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ముందు కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఫూలో దేవి నేతమ్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కొండగావ్ నివాసి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఛత్తీస్గఢ్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె 14 సెప్టెంబర్ 2020న కాంగ్రెస్ సభ్యురాలిగా ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత ఏడాది ఆగస్టులో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఫూలో దేవి నేతమ్తో సహా 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ దోషులుగా నిర్ధారించింది. భవిష్యత్తులో ఇలా ప్రవర్తించవద్దని నాడు ఈ సభ్యులను హెచ్చరించారు.
READ MORE: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
కాగా.. పార్లమెంట్ తొలి సమావేశాల్లోనూ విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీక్, ఇతర వివాదాలపై చర్చ కోరుతూ విపక్షాలు ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నీట్ పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..