DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
- రాజ్యసభలో క్షీణించిన కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం
- అపస్మారక స్థితికి చేరుకున్న రాజ్య సభ ఎంపీ
- అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లిన తోటి ఎంపీలు
- ఈ ఘటనపై బయటకు వచ్చిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కోలాహలం మధ్య ఫూలో దేవి ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకుందని సమాచారం. తోటి ఎంపీలు వెంటనే స్పందించి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు.
Also Read
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
అంబులెన్స్ లో ఫూలో దేవిని పార్లమెంట్ కాంప్లెక్స్కు తీసుకెళ్లిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆప్కి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ముందు కూర్చున్నట్లు వీడియోలో కనిపించింది. ఫూలో దేవి నేతమ్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని కొండగావ్ నివాసి. కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె ఛత్తీస్గఢ్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె 14 సెప్టెంబర్ 2020న కాంగ్రెస్ సభ్యురాలిగా ఛత్తీస్గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గత ఏడాది ఆగస్టులో.. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఫూలో దేవి నేతమ్తో సహా 12 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ దోషులుగా నిర్ధారించింది. భవిష్యత్తులో ఇలా ప్రవర్తించవద్దని నాడు ఈ సభ్యులను హెచ్చరించారు.
READ MORE: Ram Mohan Naidu: కూలిన టెర్మినల్ కప్పు మోడీ ప్రారంభించింది కాదు.. 2009లో నిర్మించారు..
కాగా.. పార్లమెంట్ తొలి సమావేశాల్లోనూ విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీక్, ఇతర వివాదాలపై చర్చ కోరుతూ విపక్షాలు ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నీట్ పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!