Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Bloc Hates Tamil Culture Yogi Adityanath On Sengol Row

Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్

Published Date :June 27, 2024 , 4:02 pm
By Mahesh Jakki
  • సెంగోల్ వివాదంపై మండిపడిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోందంటూ మండిపాటు
Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని  ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yogi Adityanath: పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ‘సెంగోల్’ ఉనికి గురించి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కె చౌదరి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ వివాదానికి ప్రతిస్పందనగా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి భారతీయ చరిత్ర లేదా సంస్కృతి పట్ల గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ‘సెంగోల్’పై వారి అగ్రనేతల వ్యాఖ్యలు ఖండించదగినవి, వారి అజ్ఞానాన్ని సూచిస్తాయని యోగి వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యంగా తమిళ సంస్కృతిపై ఇండియా కూటమికి ఉన్న ద్వేషాన్ని కూడా చూపుతుందన్నారు. ‘సెంగోల్’ భారతదేశానికి గర్వకారణమని, ప్రధాని మోడీ దీనికి పార్లమెంటులో అత్యున్నత గౌరవం ఇవ్వడం గౌరవప్రదమైన విషయమని యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Read Also: Bullet Trains: భారతదేశం అంతటా “బుల్లెట్ ట్రైన్స్”.. త్వరలో కేంద్రం అధ్యయనం..

ఆర్కే చౌదరి రాచరికానికి చిహ్నంగా పేర్కొన్న ‘సెంగోల్’ పార్లమెంట్‌లో ఏర్పాటు చేయడంలో సముచితతను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఆర్కే చౌదరి సెంగోల్ ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరికానికి సంబంధించిన అనాచార చిహ్నంగా పేర్కొన్నారు. రాచరికం అంతమై, దేశం విడిపోయిందని, అందుకే రాజదండం అవసరం లేదని, రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజదండాన్ని తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాదు, ఆ స్థలంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదం రాజుకుంది. గత ఏడాది మే 28న, కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ కుర్చీ పక్కన, లోక్‌సభ ఛాంబర్‌లో ప్రధాని మోడీ సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ‘సెంగోల్’ గతంలో ఆగష్టు 14, 1947 రాత్రి భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూచే ఆమోదించబడింది. ‘సెంగోల్’ సుమారు ఐదు అడుగుల పొడవు, విలువైన రాళ్లతో అలంకరించబడి, పైభాగంలో బంగారు గోళం ఉంది. దీని పేరు “సెమ్మై” అనే తమిళ పదం నుంచి వచ్చింది, దీని అర్థం ధర్మం.

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ ఆర్కే యాదవ్‌ను సమర్థించారు. ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించాలనే ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉద్దేశించబడ్డాయన్నారు. “సెంగోల్‌ను స్థాపించినప్పుడు, ప్రధానమంత్రి దాని ముందు వంగి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని మరచిపోయి ఉండవచ్చు. బహుశా మా ఎంపీ చేసిన వ్యాఖ్య ఆయనకు దానిని గుర్తు చేయడమే” అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

విపక్షాల తీరును బీజేపీ తీవ్రంగా ఖండించింది. “సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటులో ‘సెంగోల్’ని ‘రాజా కా దండ్’ అని పిలుస్తుంది. అలా అయితే, జవహర్‌లాల్ నెహ్రూ ఎందుకు అంగీకరించారు? ఇది వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. వారు రామచరిత్మానస్, ఇప్పుడు ‘సెంగోల్’పై దాడి చేస్తారు. ఈ అవమానానికి డీఎంకే మద్దతు ఇస్తుందా? ?వారు స్పష్టం చేయాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • INDIA Bloc
  • Parliament
  • RK Chaudhary
  • Samajwadi Party
  • Sengol Row

తాజావార్తలు

  • Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్

  • Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు…

  • US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions