మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ శుక్రవారం బీజేపీని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో భాగంలో లోక్సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.
Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్దీప్ ధన్ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
శుక్రవారం ముగిసిన శీతాకాల సమావేశాల్లో తొమ్మిది బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. డిసెంబర్ 7న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన 13 సమావేశాల్లో తొమ్మిది బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలకు సంబంధించి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943, రక్షణ శాఖలో 2,64,704 మంది, హోం వ్యవహారాల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కు శుభాకాంక్షలు తెలిపారు.
Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు.…
Congress leader Rahul Gandhi is learnt to have left for a foreign trip again. a personal visit to Europe and is expected to return on Sunday, ahead of the Presidential elections and the monsoon session of Parliament.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలను ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు కూడా ఇవేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొనడం తెలిసిందే. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు…