Parliament Sessions: “జీ20 సమ్మిట్.. భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సువర్ణావకాశం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గతంలో అనేక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారని ఆయన అన్నారు. పార్లమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, సూపర్ స్టార్ కృష్ణకు సభ్యులు నివాళులు అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడ్ రాజ్యసభ అధ్యక్షుడిగా మొదటి రోజు సభ నడపబోతున్నారని.. ఆయనకు ప్రధాని అభినందనలు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. దేశ గౌరవాన్ని పెంచేలా సభలో చర్చలు జరగాలన్నారు.
శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జీ-20కి అధ్యక్షత వహించే గొప్ప అవకాశం వచ్చిందని ప్రధాని వెల్లడించారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదన్న మోడీ.. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశమని తెలిపారు. ప్రపంచానికి భారత్ అంటే ఏంటో సామర్థ్యాన్ని తెలుసుకునే సమయమన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలని… అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నానన్నారు.
MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ, ఆప్ హోరాహోరీ
“పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం. పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలి. పార్లమెంట్లో యువ సభ్యులకు చర్చలకు అవకాశం ఇవ్వాలి. కేంద్రం ప్రతి అంశంపై చర్చ జరగాలని కోరుకుంటుంది. అన్ని పార్టీల నేతలు చర్చలకు సహకరించాలి..సమగ్ర చర్చ జరగకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలి.” అని ప్రధాని మోడీ కోరుకున్నారు.
This Parliament session is being held at a time when we are marking Azadi Ka Amrit Mahotsav and when India has assumed the G-20 Presidency: Prime Minister Narendra Modi in the Rajya Sabha pic.twitter.com/OfxiVBS68t
— ANI (@ANI) December 7, 2022
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!