5G Services: ఢిల్లీ, ముంబై సహా 50 పట్టణాల్లో 5జీ సేవలు.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Services: ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు. లోక్సభలో చౌహాన్ పంచుకున్న సమాచారం ప్రకారం, గుజరాత్లో అన్ని జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. “టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అక్టోబర్ 1, 2022 నుంచి దేశంలో 5జీ సేవలను అందించడం ప్రారంభించారు. నవంబర్ 26, 2022 నాటికి, 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 పట్టణాలలో 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి” అని చౌహాన్ చెప్పారు.
టెలికాం ఆపరేటర్లు అందించిన సమాచారం ప్రకారం.. మార్చి 2022 నాటికి దేశంలోని 6,44,131 గ్రామాల్లో 6,05,230 గ్రామాలు మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయని, 38,901 గ్రామాలకు మాత్రమే కనెక్టివిటీ లేదని ఆయన వెల్లడించారు. గ్రామాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీపై లోక్సభలో అడిగిన ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
Paytm LPG Offers: శుభవార్త.. ఇలా చేస్తే గ్యాస్ బుకింగ్పై రూ.1000 క్యాష్ బ్యాక్
గిరిజన ప్రాంతంలో మొబైల్ కవరేజీపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఆయా జిల్లాల్లో 25 శాతానికి పైగా గిరిజన జనాభా ఉన్న 1,20,613 గ్రామాలలో 1,00,030 లేదా 83 శాతం గ్రామాలు మొబైల్ నెట్వర్క్ కవరేజీని కలిగి ఉన్నాయని, 20,583 గ్రామాలు ఎటువంటి మొబైల్ కవరేజీని కలిగి లేవన్నారు. దేశంలో సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీలు (జీపీలు) ఉన్నాయని, వాటిలో 1,84,399 గ్రామపంచాయతీలు సర్వీస్కు సిద్ధంగా ఉన్నాయని భారత్నెట్ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!