అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Pakistan: పాకిస్తాన్లో గత కొంత కాలంగా చైనీయులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ పౌరులకు భద్రత కల్పించాలని చైనా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. Read Also: Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా…
న్యూజిలాండ్పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది.
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Bus Fall In Valley: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో ఘోర ప్రమాద వార్త వెలుగులోకి వచ్చింది. అక్కడ శనివారం వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. కాగా, మరో 6 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని బునెర్ జిల్లాలో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం బ్యాలెన్స్ కాకపోవడంతో లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి…
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక రోజు ముందు.. కొత్త దేశం పాకిస్థాన్ పుట్టింది. అప్పటి నుంచి పొరుగు దేశంతో మన సంబంధాలు సరిగా లేవు. ఇరు దేశాల మధ్య పలు మార్లు యుద్ధాలు కూడా జరిగాయి. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎప్పుడూ చెక్కుచెదరకుండా కొనసాగాయి. కానీ.. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అందులో పాకిస్థాన్ నుంచి వచ్చే కొన్ని రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయి. అందులో రాక్ ఉప్పు…
Pakistan : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల నుంచి పాకిస్థాన్లో పరిస్థితులు దారుణంగా మారాయి. దేశంలో ఎక్కడ చూసినా నిరసనలు, రాజకీయ సంక్షోభం ముదురుతున్నాయి.
Farooq Abdullah : జమ్మూకశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్ను తీవ్రంగా టార్గెట్ చేశారు.
India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.
ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. షాన్ మసూద్ సారథ్యంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.