Jaishankar: ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించిన జైశంకర్
- భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్
- ఈ విషయాన్ని ఆదేశస్థులే చెబుతున్నారని వెల్లడి
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.
READ MORE: Realme NARZO 80x 5G: కేవలం రూ.13,999లకే 6.72 అంగుళాల డిస్ప్లే, IP69 రేటింగ్స్, 6000mAh బ్యాటరీ
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
‘‘ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ల కట్టినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని వారే చెబుతున్నారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని పాక్ ప్రజలే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇవి ఊహాగానాలు కాదు.. వారు గర్వంగా చెప్తున్న విషయమిది. మీరొక టెర్రరిజం ఇండస్ట్రీని ప్రారంభిస్తే.. అదే మిమ్మల్ని దెబ్బతీస్తుందని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల నేడు పాక్ మూల్యం చెల్లించుకుంటోంది. నేను మీతో ఉదయం మంచిగా ఉండి.. రాత్రికి మీ ఇంటిపై వచ్చి దాడి చేస్తే మీకు ఓకేనా..? అలాంటివారితో కలిసి ఉంటారా..?’’ అని విదేశాంగమంత్రి ప్రశ్నించారు.
READ MORE: JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్
అదే సమయంలో, 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా అప్పగించడం గురించి ఆయన మాట్లాడారు. అమెరికా న్యాయ ప్రక్రియ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుందని జైశంకర్ అన్నారు. ‘తహవ్వూర్ రాణా కేసులో కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అమెరికన్ న్యాయ ప్రక్రియ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.” అని ఆయన సమాధానమిచ్చారు. బలూచిస్తాన్లో కొనసాగుతున్న అశాంతి గురించి అడిగినప్పుడు.. విదేశాంగ మంత్రి దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. బలూచిస్తాన్లో చాలా గందరగోళ పరిస్థితి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో ఆ అంశంపై మాట్లాడక పోవడమే ఉత్తమమన్నారు.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!