Islamabad blast: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యామ్నం షియా ప్రార్థనా మందిర ప్రధాన ద్వారా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.
Pakistan Balochistan Attack: పాకిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన భారీ దాడుల్లో 80 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం, పోలీస్, గూఢచారి సంస్థలు, కౌంటర్ టెర్రరిజం యూనిట్లకు చెందిన సిబ్బంది మృతి చెందినట్లు BLA ప్రకటించింది. ఈ దాడులను “ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్–2”గా పేర్కొంటూ BLA ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. Budget 2026 Expectations: బడ్జెట్పై నిరుద్యోగుల ఆశలు.. రైతుల గోస.. సామాన్యుడి ఆకలి తీరేనా? BLA ప్రకటన ప్రకారం…
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్-నోన్ గన్మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా…
ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు. Also Read:Venus: శుక్ర గ్రహంపై సమృద్ధిగా నీరు.. కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్తలు తెహ్రిక్-ఎ-తాలిబాన్…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ గురువారం బాంబు పేలుడు కారణంగా 9 మంది మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. ఈ సంఘటన వివరాలను పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించిందని డాన్ మీడియా తెలిపింది. ఈ సంఘటన తర్వాత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
Pakistan: పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు.
Pakistan Terrorist Attack: పాకిస్థాన్లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు.
Terrorist Attack : పాకిస్థాన్లోని ఉగ్రవాదులు ఇప్పుడు నేరుగా పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై, పోలియో టీకాలు వేసే భద్రతా కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు.