Pakistan: పాక్లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
- పాకిస్తాన్లో గుర్తుతెలియని వ్యక్తుల హల్చల్..
- లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
- హఫీజ్ సయీద్కు సన్నిహితుడిగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ యాక్టివ్ అయ్యారు. గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని అన్-నోన్ గన్మెన్ హతమారుస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ సిటీలో ముజాహిద్ ఇంటి వెలుపల ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఉగ్రవాదిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Read Also: Indian Student Arrested: స్టోర్ లో దొంగతనం చేస్తూ పట్టుబడిన మరో భారతీయ విద్యార్థిని..
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
హత్యకు గురైన ఉగ్రవాది షేక్ మోయిజ్ ముజాహిద్ చాలా కాలంగా లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఉగ్రసంస్థ ప్రధాన కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు ఇతను సన్నిహితుడు. మోయిజ్ హత్య తర్వాత స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని దుండగుల కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై ఐఎస్ఐ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ హతమారుస్తున్నారు. ముఖ్యంగా, భారత వ్యతిరేకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదిన్, ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పుడు ఉగ్రవాదులు హడలి చస్తున్నారు. ఎప్పుడు ఎలా మరణిస్తామో తెలియక ఆ దేశ ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతున్నారు. అయితే, ఇప్పటి వరకు పోలీసులు కానీ, ఐఎస్ఐ కానీ ఒక్క గుర్తుతెలియని దుండగుడిని పట్టుకోలేకపోయింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!