Terrorist Attack : పాకిస్థాన్లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attack : పాకిస్థాన్లోని ఉగ్రవాదులు ఇప్పుడు నేరుగా పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై, పోలియో టీకాలు వేసే భద్రతా కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. మరో ఘటనలో కూడా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు పోలీసులతో సహా ముగ్గురు మృతి చెందగా, స్టేషన్ హెడ్ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో కొందరు ఉగ్రవాదులు కూడా గాయపడినట్లు సమాచారం.
Read Also: Teacher Love Letter: సెలవుల్లో బాగా మిస్ అవుతా.. నీతో మాట్లాడాలని ఉంది.. ఉదయమే రా
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని లక్కీ మార్వాట్ జిల్లాలోని వార్గాడ పోలీస్ స్టేషన్పై మిలిటెంట్లు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల నుంచి భారీ కాల్పులు జరగ్గా, ఒక పోలీసు మరణించాడు. వార్గడ స్టేషన్ ఇన్చార్జికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని పహర్ఖేల్ ప్రాంతంలో పెట్రోలింగ్లో ఉన్న ఒక పోలీసు మోటార్సైకిల్పై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇందులో పోలీసు యూనస్ ఖాన్, అతని సహచరుడు ఇస్మతుల్లా మృతి చెందారు. ఇద్దరినీ హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోయారు.
Read Also: Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో, పోలియో టీకాలు వేసే సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. జిల్లాలోని టీకా కేంద్రానికి పోలీసు భద్రతా దళం వెళుతుండగా, అర డజనుకు పైగా తుపాకులతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఒక వంతెన దగ్గర దాక్కుని.. భద్రతా బృందం వంతెన వద్దకు చేరుకున్న వెంటనే, వారు హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి చేశారు. ఆపై భారీ కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. సహ ఉగ్రవాదితో కలిసి దుండగులు పారిపోయారు.
తాజావార్తలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!