Terrorist Attack : పాకిస్థాన్లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorist Attack : పాకిస్థాన్లోని ఉగ్రవాదులు ఇప్పుడు నేరుగా పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై, పోలియో టీకాలు వేసే భద్రతా కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. మరో ఘటనలో కూడా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు పోలీసులతో సహా ముగ్గురు మృతి చెందగా, స్టేషన్ హెడ్ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో కొందరు ఉగ్రవాదులు కూడా గాయపడినట్లు సమాచారం.
Read Also: Teacher Love Letter: సెలవుల్లో బాగా మిస్ అవుతా.. నీతో మాట్లాడాలని ఉంది.. ఉదయమే రా
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని లక్కీ మార్వాట్ జిల్లాలోని వార్గాడ పోలీస్ స్టేషన్పై మిలిటెంట్లు శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాల నుంచి భారీ కాల్పులు జరగ్గా, ఒక పోలీసు మరణించాడు. వార్గడ స్టేషన్ ఇన్చార్జికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని పహర్ఖేల్ ప్రాంతంలో పెట్రోలింగ్లో ఉన్న ఒక పోలీసు మోటార్సైకిల్పై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఇందులో పోలీసు యూనస్ ఖాన్, అతని సహచరుడు ఇస్మతుల్లా మృతి చెందారు. ఇద్దరినీ హత్య చేసిన అనంతరం దుండగులు పారిపోయారు.
Read Also: Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో, పోలియో టీకాలు వేసే సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. జిల్లాలోని టీకా కేంద్రానికి పోలీసు భద్రతా దళం వెళుతుండగా, అర డజనుకు పైగా తుపాకులతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఒక వంతెన దగ్గర దాక్కుని.. భద్రతా బృందం వంతెన వద్దకు చేరుకున్న వెంటనే, వారు హ్యాండ్ గ్రెనేడ్లతో దాడి చేశారు. ఆపై భారీ కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. సహ ఉగ్రవాదితో కలిసి దుండగులు పారిపోయారు.
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!