IED Attack Pakistan: పాక్ ఆర్మీ కాన్వాయ్పై బాంబు దాడి.. కెప్టెన్ సహా ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా వెళుతుండగా కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో డోగర్ సమీపంలో ఒక ఐఈడీ పేలింది. కాల్పుల సమయంలో ఆర్మీ ట్రక్కులకు నిప్పు పెట్టారు.
READ ALSO: Rahul Gandhi: పీఎం మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
Also Read
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
తాజాగా ISPR ఈ దాడిలో మరణించిన సైనికుల ఫోటోలను విడుదల చేసింది. వారిలో మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ నోమన్ సలీం (24), హవిల్దార్ అమ్జాద్ అలీ (39), నాయక్ వకాస్ అహ్మద్ (36), అలాగే సిపాయిలు ఐజాజ్ అలీ (23), ముహమ్మద్ వలీద్ (23), ముహమ్మద్ షాబాజ్ (32) ఉన్నారు. అనంతరం పాకిస్థాన్ దళాలు జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారు. దీని తరువాత పాకిస్థాన్ భద్రతా దళాలు బలూచిస్థాన్లో రెండు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి 18 మంది ఉగ్రవాదులను హతమార్చాయని పేర్కొంది. ISPR ప్రకారం.. బుధవారం రాత్రి క్వెట్టా జిల్లాలోని చిల్తాన్, కెచ్ జిల్లాలోని బులేడాలోని ఉగ్రవాద స్థావరాలపై భద్రతా దళాలు దాడి చేశాయి. ఈ భీకర ఎన్కౌంటర్లో చిల్తాన్లో 14 మంది, కెచ్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్లో ఉగ్రదాడులు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులు ఎక్కువగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్లో జరుగుతున్నాయి. ఈ దాడులన్ని పోలీసులు, పరిపాలన, సైనిక భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నాయి. నిషేధిత తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ప్రభుత్వంతో 2022 కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ఈ దాడులు పెరిగాయని చెబుతున్నారు. ISPR ప్రకారం.. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ నుంచి రెండు ప్రధాన ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో నలుగురు ఆత్మాహుతి బాంబర్లు సహా 25 మంది ఉగ్రవాదులు మరణించారు. ఉత్తర వజీరిస్తాన్, కుర్రం జిల్లాల్లో వేర్వేరు ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పాక్ అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Bihar Elections 2025: బీహార్లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు
Pakistan Army’s ISPR has released pictures of 6 Pakistani soldiers including a Captain killed yesterday in TTP attack at Kurram of KPK.
6 Pakistani soldiers were brutally killed and 14 others sustained serious injuries in Central Kurram of KPK yesterday. The explosion was… pic.twitter.com/8c0cL4yB8t
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 30, 2025
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?