Islamabad blast: పాక్లో ఎమర్జెన్సీ.. ఇస్లామాబాద్ భారీ పేలుడు.. 70 మందికి పైగా మృతి..
- ఇస్లామాబాద్లో భారీ ఆత్మాహుతి దాడి..
- 15 మందికి పైగా మృతి, 80 మందికి గాయాలు..
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- పాక్ రాజధానిలో ఎమర్జెన్సీ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamabad blast: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యామ్నం షియా ప్రార్థనా మందిర ప్రధాన ద్వారా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.
Read Also: Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!
Also Read
- America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
భారీ దాడిలో ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాంబర్ ను ముందుగా ద్వారాల వద్దే సెక్యూరిటీ అధికారులు నిలిపేశారు. మెయిన్ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. ఒక వేళ ప్రధాన ప్రార్థనా స్థలంలో పేలుడు జరిగితే భారీ సంఖ్యలో భక్తులు మరణించేవారని చెబుతున్నారు.
భక్తులు బయటకు వస్తున్న మసయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతతో ప్రార్థనా మందిరం ప్రవేశ ద్వారం పూర్తిగా ధ్వంసమవ్వగా, చుట్టు పక్కల భవనాల కిటికీలు పగిలిపోయాయి. రోడ్డలపై శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , పాలిక్లినిక్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్లో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది. గతేడాది నవంబర్ 11,2025లో జిల్లా కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగి 12 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!