CM Siddaramiah: కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాకిస్తాన్ వ్యాప్తంగా హెడ్లైన్గా నిలిచారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్తో యుద్ధం వద్దని, పాకిస్తాన్తో యుద్ధానికి తాను అనుకూలం కాదు’’ అని అన్నారు.
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా వేట కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా, ఉగ్రవాదులకు సంబంధించి ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. గత 48 గంటల్లో, భద్రతా బలగాలు, స్థానిక అధికారుల సమన్వయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చేసి, ఉగ్రవాదికి వ్యతిరేకంగా తమ చర్యల్ని ముమ్మరం చేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో "భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా" పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ.. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై అలెర్ట్ జోన్స్ గా ప్రకటించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
DGP Jitender: NTVతో తెలంగాణ డీజీపి జితేందర్ మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీయులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
Viral Video: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించుకుంది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్చి చంపాడాన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఇదిలా ఉంటే, ప్రపంచదేశాలు కూడా భారత్కి మద్దతు తెలిపాయి. ఉగ్రవాదం అణిచివేతలో భారత్కి సహకరిస్తామని చెప్పింది. Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది.. ఇదిలా ఉంటే,…
CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Hardeep Puri: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్ని తెగ భయపెడుతోంది. ఇదే జరిగితే పాకిస్తాన్ దాదాపుగా ఎడారిగా మారుతుంది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్కి ఆకలి చావులే గతి. అయితే, సింధు జలాలపై పాక్ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. పాక్ ప్రధాని సింధు నదిని ‘‘జీవనాడి’’గా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్…
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.