Pak-India: బోర్డర్లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!
- అటారీ సరిహద్దు దగ్గర ఉద్వేగ వాతావరణం
- పసిబిడ్డలు పాకిస్థానీయులు.. తల్లి భారతీయురాలు
- తల్లిని పాక్ వెళ్లకుండా అడ్డుకున్న భారత సైన్యం
- పిల్లల్ని తండ్రికి అప్పగిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన యూపీ మహిళ
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్లో ఉన్న పాకిస్థానీయులు అటారీ సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం భారత సైన్యం పత్రాలను పరిశీలించి సరిహద్దు దాటించారు. అలా ఒక మహిళ.. సరిహద్దు దాటుతుండగా సైన్యం అడ్డుకుంది. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళగా గుర్తించారు. భారతీయ పాస్పోర్ట్ ఉన్నందున పాక్ వెళ్లకుండా ఆపేశారు. ఇద్దరు పసిబిడ్డలను తండ్రికి అప్పగించి.. కన్నీటితో వెనుదిరిగింది.
అసలేం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివాసం ఉండే సనా అనే మహిళ పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుంది. 2020లో కరాచీలో డాక్టర్ అయిన బిలాల్ను సనా వివాహం చేసుకుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉంది. అయితే ఇటీవల తన తల్లిదండ్రులను చూసేందుకు సనా తన పిల్లలతో కలిసి యూపీకి వచ్చింది. వివాహం అయిన తర్వాత సనా భారత్కు రావడం ఇది రెండోసారి.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇంతలో పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. ఆదివారంలోపు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో అటారీ సరిహద్దుకు పిల్లలతో సనా వచ్చింది. పిల్లలకు పాకిస్థాన్ పాస్పోర్టులు ఉన్నాయి. సనాకు మాత్రం భారతీయ పాస్పోర్ట్ ఉంది. పిల్లల్ని తీసుకుని బోర్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా భారత సైన్యం సనాను అడ్డుకుంది. భారతీయ పాస్పోర్టు ఉన్నందున పాకిస్థాన్ వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ఆమె కన్నటిపర్యంతం అయింది. తనను పాకిస్థాన్ పంపాలంటూ బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. దీంతో చేసేదేమీలేక సరిహద్దులో పిల్లల్ని.. భర్తకు అప్పగించి వెనుదిరిగింది. ఈ సందర్భంగా సనా ఎక్కి ఎక్కి ఏడ్చింది. తన పిల్లలు చిన్నవాళ్లని.. దయచేసి తనను వెళ్లనివ్వాలని బతిమాలింది. అందుకు సైన్యం అంగీకరించలేదు. పిల్లల్ని తండ్రికి అప్పగించేసి.. మీరట్కు వెనుదిరిగింది. ప్రభుత్వ ఆదేశాల కొరకు వేచి ఉండాలని సనాకు సూచించారు.
పిల్లలకు పాకిస్థాన్ పాస్పోర్టులు ఉన్నందున దేశం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారని సనా తెలిపింది. అయితే తనకు భారతీయ పాస్ పోర్టు ఉన్నందున తిరిగి మీరట్ వెళ్లిపోవాలని చెప్పారన్నారు. పహల్గామ్ దాడి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని.. తనను మాత్రం పాకిస్థాన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని సనా కోరింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!