India Pakistan: గడువులోగా పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్లకుంటే.. ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసా..?
- గడువులోగా పాకిస్తాన్ జాతీయులు వెళ్లకుంటే జైలు శిక్ష..
- జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం..
- పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి, వెంటనే బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రకాల వీసాల ఉన్నవారు ఏప్రిల్ 26 వరకు దేశం విడిచి వెళ్లాలని, వైద్య వీసాలు కలిగిన వారు 29లోగా వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు భారత్-పాక్ సరిహద్దు ‘‘అట్టారీ-వాఘా’’ బోర్డర్ పాక్ వెళ్లావారితో కిటకిటలాడుతోంది.
ఒక వేళ, గడువులోగా భారత్ విడిచివెళ్లకుంటే సదుర పాక్ జాతీయుడిని అరెస్ట్ చేసి విచారించి, మూడు ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండింటిని శిక్షగా విధించవచ్చు. ఏప్రిల్ 04న కొత్తగా అమలులోకి వచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు ముగిసిపోవడం, వీసా షరతుల్ని ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను అతిక్రమించడం వంటివి చేస్తే ఈ శిక్షలు విధించవచ్చు.
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
‘‘ (ఏ) విదేశీయుడైనా, వీసా జారీ చేయబడిని కాలానికి మించి భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో ఉన్నా లేదా సెక్షన్ 3లోని నిబంధనల్ంని ఉల్లంఘించినా, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్లో ఉన్నా, వీసా ఉల్లంఘనలకు కారణమయ్యే ఏదైనా చర్యకు పాల్పడినా,
(బి) సెక్షన్లు 17,19 కాకుండా ఈ చట్టంలోని ఏదైనా ఇతర నిబంధనల్ని లేదా దాని కింద చేసిన ఏదైనా నియమాన్ని, ఆదేశాన్ని లేదా చట్ట ప్రకారం ఇచ్చిన ఏదైనా సూచనను, ఆదేశాన్ని ఉల్లంఘించినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది’’ అని చట్టం చెబుతోంది.
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!