India Pakistan: గడువులోగా పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్లకుంటే.. ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసా..?
- గడువులోగా పాకిస్తాన్ జాతీయులు వెళ్లకుంటే జైలు శిక్ష..
- జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం..
- పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి, వెంటనే బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రకాల వీసాల ఉన్నవారు ఏప్రిల్ 26 వరకు దేశం విడిచి వెళ్లాలని, వైద్య వీసాలు కలిగిన వారు 29లోగా వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు భారత్-పాక్ సరిహద్దు ‘‘అట్టారీ-వాఘా’’ బోర్డర్ పాక్ వెళ్లావారితో కిటకిటలాడుతోంది.
ఒక వేళ, గడువులోగా భారత్ విడిచివెళ్లకుంటే సదుర పాక్ జాతీయుడిని అరెస్ట్ చేసి విచారించి, మూడు ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండింటిని శిక్షగా విధించవచ్చు. ఏప్రిల్ 04న కొత్తగా అమలులోకి వచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు ముగిసిపోవడం, వీసా షరతుల్ని ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను అతిక్రమించడం వంటివి చేస్తే ఈ శిక్షలు విధించవచ్చు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
‘‘ (ఏ) విదేశీయుడైనా, వీసా జారీ చేయబడిని కాలానికి మించి భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో ఉన్నా లేదా సెక్షన్ 3లోని నిబంధనల్ంని ఉల్లంఘించినా, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్లో ఉన్నా, వీసా ఉల్లంఘనలకు కారణమయ్యే ఏదైనా చర్యకు పాల్పడినా,
(బి) సెక్షన్లు 17,19 కాకుండా ఈ చట్టంలోని ఏదైనా ఇతర నిబంధనల్ని లేదా దాని కింద చేసిన ఏదైనా నియమాన్ని, ఆదేశాన్ని లేదా చట్ట ప్రకారం ఇచ్చిన ఏదైనా సూచనను, ఆదేశాన్ని ఉల్లంఘించినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది’’ అని చట్టం చెబుతోంది.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!