Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Odisha Woman Living In India For 35 Years Ordered To Go To Pak

Odisha: 35 ఏళ్లుగా భారత్‌లోనే నివాసం.. పాక్‌లో ఎవరూ లేకపోయినా పంపేసే యత్నం. ఓ అబల ధీనగాథ

Published Date :April 28, 2025 , 10:10 am
By Suresh Maddala
  • 35 ఏళ్లుగా భారత్‌లోనే నివాసం
  • పాక్‌లో ఎవరూ లేకపోయినా పంపేసే యత్నం
  • కుటుంబంతో వేరు చేయొద్దని శారదా బాయి వేడుకోలు
Odisha: 35 ఏళ్లుగా భారత్‌లోనే నివాసం.. పాక్‌లో ఎవరూ లేకపోయినా పంపేసే యత్నం. ఓ అబల ధీనగాథ
  • Follow Us :
  • google news
  • dailyhunt

పహల్గామ్ ఉగ్ర దాడి కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపితే.. వారి చేసిన పనికి ఇంకొందరి జీవితాలకు కష్టాలు తెచ్చి పెట్టింది. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల అధికారులు.. పాకిస్థానీయుల జాడ కోసం జల్లెడ పడుతున్నారు. ఇక అటారీ సరిహద్దు దగ్గర యూపీకి చెందిన సనా మహిళ.. పిల్లలతో వేరేపోయింది. పిల్లలేమో పాకిస్థాన్.. తల్లేమో ఇండియాలో ఉండిపోయింది. ఇలా ఒక్కొక్క దీనగాథలు బయటకొస్తున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన శారదా బాయి ఉదంతం వెలుగులోకి వచ్చింది.

శారదా బాయి అనే పాకిస్థానీయురాలు.. 35 ఏళ్ల క్రితం ఒడిశాకు చెందిన హిందూ అబ్బాయి మహేష్ కుక్రేజాతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బిడ్డలకు పెళ్లిళ్లు చేశారు.. మనవరాళ్లు ఉన్నారు. వీళ్లంతా భారతీయులు. ఇక శారదా బాయికి ఇక్కడే ఓటర్ గుర్తింపు కార్డు ఉంది. కీలక పత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. భారత్‌లోనే ఓటు హక్కు వినియోగించుకుంటోంది. కాకపోతే భారతీయ పౌరసత్వం లేదు. రాష్ట్రపతికి పిటిషన్లు పెట్టుకున్నా.. లభించలేదు.

అయితే తాజాగా శారదా బాయి ఇంటికి అధికారులు వచ్చి.. తక్షణమే పాకిస్థాన్ వెళ్లిపోవాలని సూచించారు. లేదంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. 35 ఏళ్ల నుంచి తాను ఇక్కడే ఉంటున్నానని.. హిందూ అబ్బాయినే పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. దయచేసి తన కుటుంబం నుంచి వేరే చేయొద్దని ప్రాధేయపడింది.

పెళ్లైన మొదట్లో కోరాపుట్‌లో ఉండేవాళ్లమని.. తర్వాత బోలాంగిర్‌కు వచ్చినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తనకు ఎవరూ లేరని.. పాస్‌పోర్ట్‌ కూడా చాలా పాతదని తెలిపింది. తనకు ఇద్దరు పిల్లలని.. మనవరాళ్లు కూడా ఉన్నారని చెప్పింది. భారతీయురాలిగా జీవించాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. దయచేసి కుటుంబం నుంచి వేరు చేయొద్దని చేతులు జోడించి బతిమాలుతున్నట్లు శారదా బాయ్ వేడుకుంది. భారతీయ పౌరసత్వం కోసం ఎన్నో సార్లు పిటిషన్లు పెట్టుకున్నానని.. కానీ లభించలేదని వాపోయింది. బోలాంగిర్ పోలీసులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్వేగ వాతావరణం నెలకొంది.

యూపీకి చెందిన సనా అనే మహిళ కూడా 2020లో కరాచీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల తల్లిదండ్రులను చూసేందుకు మీరట్ వచ్చింది. ఇంతలో పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. ఈమెకు 3 ఏళ్ల కుమారుడు, ఏడాది పాప ఉంది. పిల్లలు పాకిస్థానీయులు.. తల్లి భారతీయురాలు. అటారీ సరిహద్దు దగ్గర సనాను పాక్ వెళ్లకుండా అడ్డుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న పంపలేదు. దీంతో చేసేదేమీలేక పసిబిడ్డల్ని తండ్రికి అప్పగించి వెనుదిరిగింది. ఇలా ఒక్కొక్కరి దీనగాథలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Pak-India: బోర్డర్‌లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 35 years
  • Living india
  • Odisha Woman
  • Ordered pak
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

  • Cyber Crime Cases: స్మార్ట్ ఫోన్‌తో జాగ్రత సుమా..! అమ్మాయిలకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచనలు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions